Thursday, August 5, 2010

యయాతి వంశీకుడు శ్రీకృష్ణదేవరాయలు!

'కృష్ణరాయలు-అస్తిత్వాల ప్రశ్నలు'(జూలై 21, ఆంధ్రజ్యోతి) వ్యాసకర్త పాణి అనేక విషయాలను ప్రస్తావిస్తూ అత్యంత బాధాకరమైన వ్యాఖ్యలు చేశారు. 'తమ కులం నుంచి రాజరికంలోకి ప్రవేశించిన వ్యక్తిగా బలిజ కులస్తులకు రాయల అస్తిత్వ ప్రతీక అయ్యాడు. ఆ కులానికి అనేక సామాజిక అనుభవాలు, ప్రత్యేకతలు ఉన్నాయి గదా' అన్నారు. రాయలు బలిజ కులస్తుడని వీరికున్న ఆధారాలేమిటి? సామాజిక అనుభవాలు, ప్రత్యేకతలు-ఆ ఒక్క కులానికేనా ఉన్నది? ఏ కులానికుం డే అనుభవాలు, ప్రత్యేకతలు ఆ కులానికుంటాయి. అదిక్కడ అప్రస్తుతం కదా! రాయల గురించి ఇన్ని కబుర్లు చెబుతున్న పాణి వారి వంశవృక్షాన్ని గురించి తెలుసుకోకుండానే ఇన్ని మాటలు చెబుతున్నారా? కృష్ణరాయల కులాన్ని గురించి పాణి వ్యక్తం చేసిన అభిప్రాయాలపై యాదవ జాతి తీవ్ర అభ్యంతరం తెలియ చేస్తుంది.
ఒక చారిత్రక వాస్తవాంశాన్ని వక్రీకరిస్తూ ఒకరు మాట్లాడినప్పుడు, ఆ విషయా న్ని గూర్చి ప్రశ్నించటం సమంజసమనే సద్భావనతో ఈ అంశాన్ని గురించి మాట్లాడాల్సి వస్తుంది. లేకపోతే సమాజానికి తప్పుడు సంకేతాలిచ్చిన వారమవుతాం; చరిత్రను వక్రీకరించిన వారమవుతాం. కృష్ణరాయల గరించి ఇన్ని విషయాలు మాట్లాడుతున్న పాణి, ఆయన స్వయంగా రాసిన 'ఆముక్తమాల్యద' కావ్యం చదవలేదనుకోవాలా? కృష్ణదేవరాయలు తాను చంద్రవంశ క్షత్రియుడినని ఆ కావ్య పీఠికలోని 19వ పద్యంలో, యాయాతి వారుసుడినని 22వ పద్యంలో చెప్పుకున్నా డు.
యాయాతికి, దేవయాని జన్మించిన వారు -యదువు, తుర్వసుడు. మిగిలిన ముగ్గురు కుమారులు -యాయాతికి, శర్మిష్ఠకు జన్మించినవారు. వీరందరూ యాదవులే. 'ఆ తుర్వసుని వంశమే తుళువ వంశమని ఏర్పడినది'-అని కృష్ణరాయలే స్వయంగా చెప్పుకున్నాడు. ఇంత స్పష్టంగా ఇంతటి ఆధారం కళ్ళకు కనబడుతుం టే, కృష్ణ దేవరాయలును -బలిజ కులస్తుడని పాణి ఎలా అనగలిగారు?
'శ్రీకృష్ణదేవరాయ వైభవం' అనే సంకలన గ్రంథంలో 'శ్రీకృష్ణదేవరాయలు- వంశావళి' అనే వ్యాసం రాసిన యన్. యస్. రామచంద్రమూర్తి ఇలా పేర్కొన్నారు: 'శ్రీకృష్ణదేవరాయలు తుళువాన్వయులని, యాదవ కులజులని చెప్పబడినది'. వసుదేవుని కుమారుడు కావున శ్రీకృష్ణుడు వాసుదేవుడైనట్లు, దశరథుని కుమారుడు కావున దాశర థి అయినట్లు తుర్వసుని సంతానం 'తుళువ' పరం గా గుర్తించబడ్డారని, వీరు యాదవ కులస్తులని ఇటు తెలుగు పండితులు, అటు కన్నడ పండితులు అంగీకరించారు.
శ్రీకృష్ణదేవరాయల ఆస్థానకవి నంది తిమ్మన, తాను రాసిన 'పారిజాతాపహరణ ము' కావ్యంలో ఎన్నోచోట్ల శ్రీకృష్ణదేవరాయలును యాదవుడుగా పేర్కొన్నాడు. ఆ కావ్య స్వీకర్త కూడా శ్రీకృష్ణ దేవరాయలే. తన ఆస్థానంలోని కవి, తన గురించి, తన వంశావళిని గురించి తప్పుగా రాస్తే ఏ రాజైనా సహించగలడా? ఏ కవి అయినా తన రాజును గూర్చి తప్పుగా రాయటానికి సాహసించగలడా? ఈ కావ్యం లోని ప్రథమా శ్వాసము నందలి 'కృతిపతి (చంద్ర) వంశ ప్రశస్తి'లోని, 17, 19 పద్యాలు అత్యంత కీలకమైనవి.
పందొమ్మిదవ పద్యంలో ' నాడు నేడును యాదవాన్వయ ము నందు జననమందెను వసుదేవ మనుజ విభుని కృష్ణుడను పేర నరసేంద్రు కృష్ఱదేవరాయడను పేర నాది నారాయణుండు' అంటూ శ్రీకృష్ణ దేవరాయలు యాదవుడని స్పష్టీకరించాడు నంది తిమ్మన. మరి పాణి ఈ కావ్యం చదవలేదా? ఆచార్య యార్లగడ్డ బాలగంగాధరరావు గతంలో 'కమ్మ వికాసం'లోను, నేడు 'పల్నాటివీరచరిత్ర'లోను అతి స్పష్టంగా చెప్పారు-శ్రీకృష్ణదేవరాయలు యాదవుడని.
ఆచార్య ఎస్ గంగప్ప 'తెలుగు విద్యార్థి' (జూలై 2010)లో తెలుగు కన్నడ రచయితల గ్రంథాలను స్పష్టంగా ఉదహరిస్తూ , ఆధారసహితంగా-శ్రీకృష్ణ దేవరాయలు యాదవుడని స్పష్టంగా వివరించి చెప్పారు. పి. శ్రీరామమూర్తి రాసిన 'ఏ హిస్టరీ ఆఫ్ విజయనగర ఎంపైర్' అనే గ్రంథంలో కృష్ణరాయలు యాదవుడే అని (126వ పేజీ) పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన మరెన్నో ఆధారాలు మా వద్ద ఉన్నాయి. ఈ ఆధారాలన్నింటి మూలంగా శ్రీకృష్ణదేవరాయలు యాదవుడేన ని మేము స్పష్టంగా ప్రకటిస్తున్నాం. ఇందుకు అభ్యంతరమున్న వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే, చర్చకు యాదవ జాతి సిద్ధంగా ఉంది.
కన్నడ రాయడుగా పేరు పొందిన రాయలును తెలుగు రాజుగా చూపటానికి చేస్తున్న ప్రయత్నాలలో జాతి ప్రాతిపదిక ఉందని పాణి అన్నారు. కృష్ణరాయల జన్మతః కన్నడిగుడే అయినప్పటికీ, తన చిన్నతనం నుంచీ తెలుగుదేశంలో (చంద్రగిరి ప్రాంతంలో) పెరిగి ఇచ్చట భాష, సంస్కృతి, ఆచార వ్యవహారాలను పాటించి పూర్తిగా తెలుగు వాడయ్యాడు.
అదే మమకారంతో తన రాజ్యంలో కన్నడ , తమిళ ప్రాంతాలు ఉన్నప్పటికీ అత్యధికంగా తెలుగు కవులనే పోషించాడు. తాను స్వయంగా 'ఆముక్త మాల్యద'కావ్యాన్ని తెలుగులో రచించాడు. తన తాను తెలు గు రాజుగా చెప్పుకున్నాడు. 'దేశ భాషలందు తెలుసు లెస్స'అన్నాడు. ఇంతగా తెలుగు నేలతో తెలగు భాషతో మమేకమైన కృష్ణరాయలును తెలుగు రాజుగా చెప్పుకోవటం నేరమా? ఒక్క పూట భోజనం పెట్టిన వాడికి పదిసార్లు కృతజ్ఞతలు చెప్పుకుంటామే! తెలుగు భాషకు శాశ్వత కీర్తి ప్రతిష్ఠలు ఆర్జించి పెట్టిన ఒక మహనీయునికి కృతజ్ఞతా సూచకంగా మన చేస్తున్నదేపాటి?
-యద్దనపూడి వెంకటరత్నం యాదవ్

96 comments:

  1. అన్నా నాకు కొన్ని డౌట్స్ వున్నాయి మన యాదవ కులం గురించి. 1.మహాభారతం లో యాదవులంతా ముసలం పుట్టి అంతరించి పోయారు, యదువంశం లో చివరి వాడు శ్రీకృష్ణుడే అంటారు. అందరూ నశించిపోతే మనమెలా మిగిలాం?
    2.ఆంధ్ర ప్రదేశ్ లో మనల్ని గొల్లలు అంటారు కదా మనకు యాదవ అనే పేరు ఎలా వచ్చింది? మన ఉప కులాలను కూడా కురుమ, కురుబ అనే అంటారు కదా.
    3.నా చిన్నప్పటి నుండి మా నాయన, మా జేజినాయన మనం గొల్లొళ్ళమనే చెప్పారు. వాళ్ళు చదువుకోలెదు. మా ప్రకాశం జిల్లాలో మన కమ్యూనిటీ చాలా ఎక్కువ ఊర్ల పేర్లు కూడా గొల్లపల్లె గొల్లవారి పల్లె అని మాత్రమే వున్నయి కానీ ఎక్కడా యాదవపల్లె అని లేవు? మనం యాదవులము అని చెప్పుకోవడం కరెక్టేనా?
    4.ఆ మధ్య నేను యుపి వెళ్ళాను అక్కద నాకు ఒక మిత్రుదు తగిలాడు పేరు రాంలాల్ యాదవ్ నేను అతడి పేరులో యాదవ్ చూసి హేయ్ నేనుకూడా మీ కులమే అన్నాను. నై చల్ చల్ ఆప్ ఆంధ్ర మే బకర చలానెవాలె హమారె యాదవ్ నై వైసె బాత్ మత్ కరో అంటూ నన్ను చూసి ఈసడించుకున్నాడు. నాకు చాల బాధ వేసింది. మనము యుపి యాదవ్ లు ఒకటి కాదా?రాంలాల్ నాతో అన్నదేంటంటే మేము క్షత్రియులము మీరు కాదు అన్నాడు. మీరు గొర్రెలను కాసేవారె కాని యాదవు లెలా అవుతారని నిలదేశాడు. మాపెరు చెప్పుకుని ఆంధ్రా లో మా సిగ్గు తీస్తున్నారని నోటికొచ్చినట్లు మాట్లాడాడు. నిజంగా మనకు వాళ్ళకు సంభంధం లేదా?
    మనవాళ్ళను చాలామందిని ఈ డౌట్లు అడిగాను కానీ నాకు ఎవరూ సమాధానం చెప్పలెకపొయారు. దయచెసి మీరైనా నా దౌట్లు తీరుస్తారని ఆశిస్తాను. ఈ సందేహాలు ఇతర కులాల వారు కూడా లేవదీస్తున్నారు మనం వారికి చెప్పుతో కొట్టినట్లు సమాధానం చెప్పాలి.

    ReplyDelete
    Replies
    1. అసలు యాదవ్ అంటె తెలుగు మేనింగ్ కాదు సన్స్క్రిత్ భష పదం అపట్ళో యాదవ్స్ కుడ అవులు,గొర్రలు కస్తున్నరు కబటె యాదవస్ని కుడ గొల్ల అనె పదం వచేంది (ద్వపర యుగంలొ క్రిష్నుడి తండ్రి వసుదెవుడు దెవకిదేవి కులం యాదవ్ రాజులు ,నందబబ యషొదదేవి కులం గొల్ల రాజులు కాని రొండు కులలు ఒక్కటె లెవెల్ అందుకే వసుదెవ్డు నందుడు ఇంట క్రిష్నుడుని వదిలి వెలడు అప్డిలొ సమన కులం వరికె మరియద ఇట్చెవరు ) యాదవ్స్,గొల్ల ఒక్కతైపొయరు (నెల్లురు,ప్రకాశం,గుంటురు,క్రిష్న జీల్లలొ పూజ రాజులు అనె యాదవ్స్ క్రిష్నుడు వంశం వల్లు ) కలం క్రమిన వెల్లని కుడ గొల్లలు అన్ని పిలుస్దున్నరు కని కదు వీల్లు ఉతరబారతదేశం నుంచే వఛీనవల్లు మె ఫ్రిఎండ్ తో చెప్పు మెము ఒర్ఝినల్ యాదవ్స్ అని చెప్పు

      Delete
    2. bharthamlo arjunudu dwaraknu munchethuthunna oka pedha pralayanni chusanani cheppadu....adi munde pasigatti kurukshetra yudham taravatha akkadunna yadavulanu mathuraku, brindavananiki taralistadu...taralinchi yadavulaki raajyalappagistadu.....idi cheppandi vandana garu vaalle kottukuntaru.........doubt unte chadukomani cheppu...telisostundi

      Delete
  2. ఒక్క పూట భోజనం పెట్టిన వాడికి పదిసార్లు కృతజ్ఞతలు చెప్పుకుంటామే! తెలుగు భాషకు శాశ్వత కీర్తి ప్రతిష్ఠలు ఆర్జించి పెట్టిన ఒక మహనీయునికి కృతజ్ఞతా సూచకంగా మనం చేస్తున్నదేపాటి? యద్దనపూడి వెంకటరత్నం యాదవ్ గారు చక్కగా చేప్పారు. చరిత్రలో మహానుభావులు చాలామంది పుట్టారు. తమవాడంటే తమవాడని చాలామంది చెప్పుకుంటుంటారు. ఎందుకంటే చరిత్ర ఆయా జాతులకు గౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. చరిత్ర పరిశీలనలో చిన్న తప్పటడుగు పడితే ఆ తరువాత చరిత్ర మొత్తం తప్పుదారి పడుతుంది. అలాంటి దారినే గొల్లవారు తప్పారు. అందువల్లనే వారికి 20వ శతాబ్దం వరకు గొల్లలు, కురుబలుగా వున్న వారు తెలుగు కవుల అనువాద దారిద్ర్యం వల్ల యాదవులమంటూ ప్రక్కదారి పట్టారు. వందనదాస్ గారన్నట్లు ఉత్తర భారతం లో గొల్లలను "దనగర్" లంటారు యాదవులు ఉన్నతకులాలకు చెందినవారు. అందువల్ల ప్రస్తుత పొరపాటు సమస్యలు ఎదురవుతున్నాయి. ఇంతకంటే ఎక్కువగా నేను గొల్లల గురించి చర్చించడం నాకు మర్యాదకాదని భావిస్తున్నాను. వెంకతరత్నం యాదవ్ గారన్నట్లు ఏ కులానికుం డే అనుభవాలు, ప్రత్యేకతలు ఆ కులానికుంటాయి. ఇక్కడ నేను ఎవరినీ కించపరచడానికి ఈ కామెంట్ రాయడంలేదు.
    కేవలం శ్రీకృష్ణదేవరాయలు బలిజ కులస్టుడు అనడానికి ఏం ఆధారాలున్నాయి అంటూ బలిజ కులస్తుల మనోభావాలు దెబ్బతినేవిధంగా రాసిన రాతలను ఖండించడానికి మాత్రమే ఏ కామెంట్ రాస్తున్నాను. విజయనగర చరిత్ర గురించి శ్రీ పుట్టపర్తి నారాయణచార్యులు పరిశోధన చేసినంతగా మరొకరు పరిశోధన చేయలేదన్న వాస్తవం నాకేకాదు ఈ బ్లాగ్ నిర్వాహకులు తవ్వా ఓబుల్ రెడ్డి గారికి కూడా తెలుసు.
    అలాంటి పుట్టపర్తి వారే స్వయంగా "శ్రీకౄష్నదేవరాయలు బలిజకులానికి చెందినవాడు ఒకప్పుడు క్షత్రియులు,బలిజలు ఒకేతెగకు చెందినవారు శ్రిరాయలు సంపెట వంశీయుడు తుళు ప్రాంతం లో రాయల పూర్వీకులు వుండినందున తుళువ వంశీయుడన్నారు కానీ వాస్తవం కాదు. ఆరవీటివారు, ఏటూరివారు, ఔకు వారు, నంద్యాలవారు, చొక్కపువారు, దువ్వూరు వారు రాజబంధువులు" అని స్వయంగా ఆయన చేత్తో రాశారు. ఆ ధృవీకరణ పత్రం జిరాక్స్ కాపీని ఓబుల్ రెడ్డి గారికి పంపిస్తాను గమనించగలరు. పాణిగారు రాయలు బలిజ అని రాస్తే మీ మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. మరి ఎలాంటి ఆధారాలు లేకుండా రాయలును గొల్లవాడు అని అనడమే కాకుండా అసహ్యకరమైన కామెంట్లు చేశారు దానికి మాకెంత బాధ కలిగివుంటుందో వెంకతరత్నం యాదవ్ గారు ఆలోచించాలి మరి.

    ReplyDelete
    Replies
    1. putaprthi narayanacharyulu srikrishnadevarayalu balija ani vrasi vundavachu.Adi poorthiga thappu.P.N.charyulu vrasinantha mathrana angikaricha valasina avasam ledhu.Ayana vrasina vijayanara charitra mariyu Penugonda la kosam Ayana sasanala meedha aadharapada ledhu.Jiraskh copy undavachu.Ayana vadhana parishaku nilavali kadha!Balija kulam,kshatriya kulamulu veru.Kshatriya kulam puttuka B.C ki mundu.Balija kulam A.D.Itivali kalamlo Balija kulastulu ala cheppukuntunnaru.Idi charitraki vyatirekam.Intiperulu kula nirdharanaku kolamanakm kadu.Ee intiperululu aneka kulalo unnayi.Balijalu vaari vadhana sarikadhani thelisina kooda mondiga vadhisthunnaru.Krishnarayale syayamga nenu yadavudanani cheppithe kadhnataniki P.N.charyulu evaru.krishnarayalu kante thana kulam gurinchi P.N.charyulu ki ekkuva telusuna?Gollavadu ante thappemundhi?Gollalani yadavalandamu anadiga vastunnadekadha!Meedi kaani varini meevarani cheppukovadamenduku?Anekamandhi charitra karulu SKDR yadavakulani(golla) chendiranicheppinakooda P.N.C.lu garimeeda aadarapadatam avivekam.SkDR ni balija ani lokanni nammichataniki kotha kotha vadhanalanu thisukostunnaru.Balija kulastulu varikistamainanatlu vrasukoni dhanini evaru prasnincha koodadhantunnaru.Balijapuranalu kaakunda,aneka pustakalu vijayanagara chariameeda unnayi vaatini chadavandi, meeku meere telusukuntaru SKDR asalu evaranedi.Vijayanagaram paalinchina naalugu rajavamsalu okarikokaru bandhuvulu ani charitra chepputhunnadi.Sangama vamsastulu kuruba sakaku chendina yadavulamani vaare cheppukunnaru, daanini elakadantaru?Tv9 kannada channello SKDR meeda charcha jarigindi.Adi YUTUBE lo unnadi chudandi.Charitrakarulu emichepparo vinandi.Meelanti vidyavantulukooda meevaarilo kondaru srustinchina thappudu pracharanini nammadam sahetukam kaadu.Battarsetti Padmarayalu laanti vaari rachanalu nammi itarula varusulanu meevaruanukoni bramalu penchovaddu.Aadaralu emi unnayi ani prasnistene meeku baadakaliginappudu vari poorvikulanu meeru egaresukupothunte vaariki inka entha baadhaga untadi?Aalochinchandi?

      Delete
  3. అయ్యా అనామకా (మీ పేరు చెప్పుకోలేకపోయారు కాబట్టి) శ్రీకృష్ణదేవరాయలు యదు వంశీకుడిని అని చెప్పుకున్నారే కానీ గొల్లవాడిని అని చెప్పుకోలేదు. యదు వంశీకులు, కురు వంశీకులు వీరంతా బంధువులు చంద్రవంశ క్షత్రియులు గొల్లలు కాదు. ఈ చంద్రవంశ క్షత్రియులు వివిధ భాషలలో వివిధ పేర్లుగల కులాలుగ చలామణి అవుతున్నారు వీరు మహారాష్త్ర లో కుర్మిలుగా, తమిళనాడులో నాయకర్, వడుగన్స్ గా పిలువబడుతున్నారు. వీరితో మీ గొల్లలకు బంధుత్వాలు వున్నట్లు మీరు నిరూపించగలిగితే మీ వాదనలు ఒప్పుకుంటాము. మీ పేరు చెప్పండి మీ సర్టిఫికేట్ లో యాదవ అని వుందో గొల్ల అనివుందో చూద్దాం. ఉత్తర ప్రదేశ్ లో యాదవులు అగ్ర కులాలు మిమ్మల్ని దనగర్ అని అంటారు. ముందు మీ కుల చరిత్ర తెలుసుకోండి. తరువాత శ్రీకృష్ణదేవరాయలు కులం గురించి మాట్లదదాం. పుట్ట్పర్తి నారాయణాచార్యుల గురించి మీకు కనీస పరిగ్నానం కూడా వున్నట్లు లేదు. నా పూర్వికుల గురించి నా ఇంట్లో మాట్లాదుకుంటారే కానీ మీ ఈంట్లో మాత్లాడుకోరు. పుట్టపర్తి వారు క్రిష్ణరాయల రాజ గురువు తాతాచార్యుల వంశీకుడు. విజయనగర చరిత్ర పై ఆయన చేసినంత పరిశోధన మరెవ్వరు చేయలేదు. ఆయన కవిగా కంటే కూడా చరిత్ర పరిశోధకుడుగానె ఎక్కువ ప్రసిద్దికెక్కరు. ఆయనను విమర్శించాలంటే మీ లాంటివాళ్ళు వందమంది నాలాంటివాళ్ళు వందమంది చేరినా ఆయన కాలి గోటికి కూడా సరిపోము. చరిత్ర నేను రాసిన పుస్తకాలలోనో మీరు రాసిన పుస్తకాలలోనో వుండదు. శాసనాలలో, తాళపత్ర గ్రంధాలలో వుంటుంది. నేను ఈప్పుడు సవాల్ చేస్తున్నాను. రాయల వారి బంధుత్వాలలో 300 బంధుత్వాలు బలిజ కులస్తులలో చూపిస్తాము ఇందులో సగం ఇండ్ల పేర్లు అయినా ఇతర కులాలలో చూపిస్తే మేము కృష్ణదేవ రాయలు మావాడని చెప్పుకోవడం మానేస్తాము. దీనికి సిద్దపడిన వారెవరైనా వుంటే రండి రూ.1,00,000/- పందెం. నా సెల్ నెం.9490483744. పొరపాట్లు ఎవరికైనా సహజం. నేను మిమ్మల్ని కించపరచాలని యాదవులు, గొల్లలు ఒకటి కాదని అనడం లేదు. చరిత్రలో ఇక్కడే మీరు తప్పటడుగు వేశారు. ఆ టప్పతడుగు మిమ్మల్ని తప్పుదారి పట్టించింది. మీరు యాదవులు అని చెప్పుకున్నా మరెవరని చెప్పుకున్న మాకెటువంటి అభ్యంతరం లేదు. కానీ ఆ తప్పు దారిలో వచ్చి రాయలు మావాడని అంటున్నారు చూడండి అక్కడ మాత్రమే మాకు అభ్యంతరం. చరిత్రను చూసి బలిజ పురాణం రాసి వుంటారు. అంతేకాని బలిజపురాణం చూసి చరిత్ర రాయరు. మీ గొల్ల వెబ్ సైట్ వికిపీడియా లో ఏముందో ముందు చూసుకోండి ఆ తరువాత మిగతా కులాలపైకి యుద్దనికి రండి. బెస్టాఫ్ లక్.

    ReplyDelete
    Replies
    1. Maharastralo yadavulanu koormi lantarani annaru adhi poorthiga thappu.kormilu sudra caste ki chendhi kshatriyaga gurthimpu ki prayatnistunnaru.Evarini evaru kinchaparchukovalasina avasaram ledu.charchakocharu.mee vadane correct ani thelithe daanini andaru angikaridham.charitralo yadavulu ani gollalaku kaakunda marievaiki undi.Meerantunatluga SKDR balija ayite aavisayanni enduku saasanaalalo cheppaledu.Meeru yadavulu balijalu okate antara?Charitra talapatralalonu, saasanaalalonu untundi annaru,Ade andaru cheppedi.SKDR vesina saasanaalanenduku pariganaloki theesukoru.Golla anedi vruthiparamaina peru.Yadava anedi poorvikulanundi vachina pouranika naamamu.Gollalaku aneka upa saakhalu unnayi.okkokka prantamulo okkokka perutho pelavabaduthunnaru.Balijalalo kooda aneka saakhalu unnayi, vaatannitini veru veru antara?Grama prantalalokooda yadavulanu meedi ye koolamu ani adigite mundu vallu i gollalamu antaru, inkoka peru undatagada ani adigite appudu yadavulam antaru.Idi chaduvurani gollalanu adigite jarigedi.Idi anaadi kaalamunundi vastunadi.yadavulu gollalu okatenani cheppataniki SKDR kaalamunati saasaname unnadi.300 bandutvalantava asastriya vidhanamadi.Padmarao garichinadi konnimatrame.migilinavi madura raja kutumbamvaari banduyvalu.Oke inti peru aneka kulallo vundunu. anthamaatrana vaarandhridi oke kulam avuthundaa?.P.N.Charyulugaaru ye pustamlonu SKDR yokka vamsavruksam talapatra grandam vaari dhaggara vunnadani prakatincha ledu, daanini prachurinchaledu.kevalam koni intiperulu galigina balijalu rayalagaari banduvulu annaaru.Mee vaddha vunna aayana chetivrata copy lo vunnadi ade.Rayalavaari inti peru sampeta,sammeta ane intiperugalavaru rayalaseemalo balijalalo unnaru ani kooda aayana annaru.sameta inti peru kammalalo kooda unnadi.vaaru kooda rayalu maavade antunnaru.Meeru meekulamulovari inti perulu maatrame choochukunnaru.Ave inti perulu etara kulaalalo kooda unaaya leda ani oka samagramaina survey saastriyamuga sociologists cheta chepichara?Nannu golla websitelo choodamannaru, meeru kooda yadava,golla, Ahir, dhangar, kuruma,kuruba jadhav lanti sites chooda galaru.Yadavulu rayalu maavadante abyataramu antunnaru, rayalu ekkada nenu balija ani cheppaledu. Mari meeru rayalu maavaadani yela anagalaru.intiperula vidaname oka asaastriyamainadi. Ye anubavgnudaina charitra karudanaina adagandi cheputaru.AA vidanani pattukochi chalenge cheyadamemiti.SKDR meevadani cheppukovadaniki meeru chaala prayatnistunnaru.Modata SKDR thalli balija kulasturalu,kaabatti SKDR kooda balija annaaru,ippudu inti perulu ,banduvulu antunnaru,Vijayanagara history meeda,SKDR meeda vistruta adyanam chesina KAMAT gaarito charchimsandi.P.N.Charyulu gaaru ippudu leru kaabatti. .
























      Delete
  4. please see this site. http://en.wikipedia.org/wiki/Kurmi

    ReplyDelete
  5. సంతోషం అనామకుడు గారూ బలిజ కులస్తులు యాదవులు ఒకటే అంటారా అని అడిగారు సంతోషం. నేను కేవలం ఆధారాలతో మాత్రమే మాట్లాడాలనుకుంటున్నాను. నాకు ఇంగ్లీషు వాళ్ళంటే చాలా అసహ్యం. కానీ నేడు మీలాంటి వారి వల్ల వాళ్ళు మనకు సేవ కూడా చేశారని ఒప్పుకోక తప్పడం లేదు. తెల్ల వాళ్ళు ప్రతి ప్రాంతానికి సంబంధించిన వివరాలను గెజిట్ ల రూపం లో భద్రపరిచారు. వాటిలో బాంబే గెజిట్ ఒకటి.
    The Poona Kunbis not content with calling themselves Marathas, go so far as to call themselves Kshtriyas and wear the sacred thread they include a traditional total of Ninety six clams which are side to be sprung from the rules of fifty six contries who are the desandants of Vikram of Ujjaini whose traditional date is B.c 5, Shali Vahana of paitham whose traditional date is A.D.According to the traditional accounts. The Bhonsles to whoom Shvaji belonged are the descendents of Bhojaraja. The descendants of Vikram are called sukarajas and those of Shalivahana (Rajaputra). All claim to belong to none of the branch, sesha vamsa or the snake Branch and Yadu Vamsa
    Bombay Gajette Vol's 18,21and 218.

    ReplyDelete
  6. బలిజ లు కాపు లు ఒకటే

    Under Kapu Heading in castes and tribes of Southern India Vol.No.117

    Balija:- The Chief Telugu trading casts many Balijas are now engaged in cultivation and this accounts for so many having returned Kapu as their main castes - kapu is a common Telugu word for many or cultivator it is not improbable that there was once a closer connection.

    ReplyDelete
  7. కునిబి లు కాపులు ఒక్కటే

    The Kapus or Kunibis the great Agricultural Caste in the State members 29,53,000 Persons or 26 percent of the whole population.

    Vol.XIII Page no. 247, Hyderabad State Gazette.

    ReplyDelete
  8. యాదవులంటే బలిజలే కాని గొల్లలు కాదు అనడానికి ఈ ఆధారాలు చాలా ఇంకేమైనా కావాలా?

    ReplyDelete
  9. కునిబి లు కూర్మిలు ఒకటే

    Maharattas the Agricultural kunbis of the Chief Traibe same as the kurmis of Northern India to them pecularly belongs the name maharata.

    About the middle of the 16th century the Maharattas under "Shivaji" recovered the power they had before the Mohamdins in vaded Deccan.

    -The Principal Nations of India.

    ReplyDelete
  10. రాయలు కులం గురించి తరువాత మాట్లాడుకుందాం.
    యాదవులు, గొల్లలు ఒకటా కాదా అన్నది ముందు నిర్ధారించుకుందాం. చర్చ ఒక పద్దతిగా సాగితే నిజానిజాలు బయటపడతాయి. అంతర్జాలం లో http://lekhini.org/ అని సైట్ వుంది. దానిలో టైప్ చేసి కాపి పేస్ట్ చేయొచ్చు. ముందు మీ కష్టం తగ్గించుకోండి

    ReplyDelete
  11. The caste word kunbi as you said is not a caste on its own.It is a word referring a group of three or four individual castes of which one is yadav or jadav.The word is being used to refer to those castes which engaged full time in agriculture.Some of the writers have been using the word kunbi when referring to the castes engaged in cultivation,other than in Maharastra.In that sense the castes koormi and kapu are compared to kunbi to understand those castes' occupation and social status.The information you gave about poona kunbi is about the yadava caste which is major caste in kunbi category and which is residing vastly in poona area.As there are many castes in kapu category in A.P.It is also the with kunbi.in Maharastra.You can learn about kunbi more on website of kunbi.

    ReplyDelete
  12. మీరు ట్రాక్ తప్పుతున్నారు మహాశయా మీరు ఉత్తర భారతదేశ యాదవులు ఒక్కటే అని నిరూపించండి. లేదా వారితో మీరూవారూ ఒకటే అనిపించండి. నేను ఈ కొన్ని ఆధారాలు కేవలం శాంపిల్ కొరకు చూపించాను. మీరు ఒక్క ఆధారం కూడా చూపించకుండా మీ స్వంత వాదనలను వినిపిస్తున్నారు. ముందు మీరూ యాదవులూ ఒకటే అని నిరూపిస్తే ఆ తరువాత రాయల వారి గురించి చర్చించాల్సి వుంటుంది. మీరు అల్పుడినైన నా వాదనలకే నిలువలేకున్నారే ఎవరెస్ట్ శిఖరమంతటి పుట్టపర్తి నారాయణాచార్యులను విమర్శించే అర్హత మీకు వుందో లేదో ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోండి. బెస్టాఫ్ లక్.

    ReplyDelete
    Replies
    1. చర్చకొచ్చినది మీరు.దానిని ప్రక్కదారి పట్టిచ్చినది మీరు.క్రిష్నరాయలు బలిజ అని నిరుపించె ఆధారలు చుపకుపోగ,యాదవలు గొల్లలు వేరు అని వాదనకు దిగినది మీరు.మీదగ్గర ఆధరలు ఉంటె చూపు లెకపొతె మానుకొ.బలిజల్ను యాదవులంటారని ఎవరు చెప్పారు?ఇతర కులాల చరిత్రను మాది అని చెప్పుకుంటున్నది ఎవరు?

      Delete
    2. పుట్టపర్తివారివద్ద క్రిష్నరాయలు బలిజ అని చెప్పటానికి ఏ ఆధారలు లేవు.తన సొంత అభిప్రాయాన్ని చెప్పారు.చరిత్రకు సంబందించి ఎవరైన ఏ అభిప్రాయన్ని కలిగి ఉండవచ్చు.కాని ఆధారలు లెకుండా అవి కేవలం అభిప్రయలవుతాయి అంతె!ఇంటి పేరుల విధానం అశాస్త్రియం.ఏ చరిత్రకారుడు అంగీకరించడు.ఉత్తర భారతదేశం అయినా దక్షిన భారతదేశం అయినా యాదవలు యాదవలె,గొల్లలు గొల్లలె,యాదవులె గొల్లలు గొల్లలె యాదవులు!ఇది శాతాబ్దాల చరిత్ర.ఇది దేశ వ్యాప్త కులం.వివిద ప్రాంతాలలొ వివిద పేరులతొ పిల్చుతారు.అహిర్లు,గొల్లలు ధంగర్లు,ఇడియానులు,గ్వాల,గావిలి,కోనారు,మనియాని,కురుబ,యాదవులు వగైర.యాదవ అనెది వారి ప్రాచిన నామం,పౌరనిక నామం.స్తానికంగా ఎవరు ఎమని పిలిచినా,ఎఏ పేరుతొ పిలిచినా,వారు తమను యాదవులుగానె సంభొదించుకుంటారు. martial races of undided India అనె గ్రందాన్ని చూఢండి!

      Delete
    3. మీరు బలిజలు యాదవులు ఒక్కటె అనె వాదన చేసారు.అందుకు మహరాస్ట్రలొని కుంభి వర్గంలొని గొల్లలైన ధంగర్ లెక జాదవ అనె కులానికి చెందిన సమాచారాన్ని చూపి కుంబిలంటె యదువంశియులని ఉంది,కుంభిలంటె ఆంధ్రాలొ కాపులంటరు కాబట్టి బలిజ కాపులమైన మేము యాదవులం అవుతాం అనె వాదన చేసారు. ఎంత పిచ్చివాదన అది.కుంభి వర్గంలొ అనేక కులాలు ఉన్నాయి.ఏ కులం చరిత్ర ఆ కులానికి ఉంది.కుంభి కాపు పదాలను సరిగా అవగాహన చెసుకోకుండ పొరపాటు పడ్డారు.

      Delete
  13. అయ్యా అనామకుడు గారూ నేను నా వాదనను పక్కా సాక్షాలతో చూపుతున్నాను. గెజిట్ లు గానీ, పుట్టపర్తి నారాయణాచార్యులు ఇచ్చిన సర్టిఫికేట్ కానీ నెను రాసినవి కావు. నేను సేకరించినవి మాత్రమే. ఇక మీరు ఎక్కడ పొరపాటు పడ్డారో చూపించాను. గొల్లలకు చరిత్ర లేదని వారిని నేను కించపరచాలని అనుకోవడం లేదు. మీకు వున్న ఏకైక సాక్ష్యం పారిజాతాపహరణం లో ముక్కు తిమ్మన గారు రాసిన

    యాదవత్వమున సిం హాసనస్తుడుగామి
    సిం హానస్తుడై చెన్నుమెరయ
    నాడునూ నేడునూ యాదవాన్వయమునందు
    జననమందెను వసుదేవ
    మనుజ విభుని కృష్ణుడను పేర
    నరసేంద్రుదు కృష్ణరాయలుగా నాది నారాయణుండు.

    ఈ పద్యం లొని మొదటి పాదం లో యాదవత్వమున కృష్ణుడు సిం హాసనము అధిష్టించలేకపోయాడు అని అర్థం. యదువంశీకులు చంద్రవంశ క్షత్రియులైనప్పుడు రాజ్యాధికారం దక్కక పొవడం ఏంటి? ఇక్కడ తిమ్మన గారి ఆంతర్యం గమనించండి. కృష్ణుడు పసుపాలకుల ఇంట పెరిగినందువల్ల రాజ్యాధికారానికి అర్హత కోల్పోయాడు. అని అర్ధం.
    రెండవపాదానికి అర్ధం రాజ్యం చేయాలనే కోరికతో
    మళ్ళీ యదువు సోదరుని(తుర్వసుని) వంశమందు వసుదేవుడు నరసేంద్రునిగా(నరసిం హరాయలుగా)కృష్ణరాయలుగా ఆదినారాయణుండు (శ్రీ మహా విష్ణువు)
    అని అర్థం. అంటే పశుపాలకుల ఇంట పెరిగితేనే రాజ్యాధికారార్హత కృష్ణుడే కోల్పోయాడు. ఇది నంది తిమ్మన చమత్కారం మాత్రమే. పశుపాలకుల ఇంట పెరిగితేనే కృష్ణుడు రాజ్యార్హత కోల్పోయాడు. మరి పశుపాలకులెలా రాజులవుతారు? ఇది మీ గొల్ల కులస్తుల వాదనకు వివరణ.

    ReplyDelete
  14. అంటే నారాయణాచార్యుల వారు పారిజాతాపహరణం చదవలేదంటారా? అందులోని పద్యాలు మీరు అర్ధం చేసుకున్నంతగా ఆయన అర్థం చేసుకోలెదంటారా? పేరు చెప్పుకొలేని మీరు, ప్రపంచప్రఖ్యాతి గాంచిన పుట్టపర్తివారిని విమర్శిస్తుంటే వాదనలో పోటీపడలేక అడ్డంగా వాదిస్తున్నట్లుగానే కనిపిస్తోంది. ఆయన దగ్గర ఆధారాలు లేవని మీకెలా తెలుసు? ఆయన చరిత్ర తెలుసుకొకుండా స్వంత అభిప్రాయాలు మాట్లాడారని చెప్పడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలేమిటి? శ్రీకృష్ణదేవరాయలు ఇంటిపేరు సంపెటవారని మొట్ట మొదట చెప్పిందే శ్రీ ఆచార్యుల వారు. ఆయన చెప్పిన సంపెట నిజమని అంగీకరించినప్పుడు రాయలు బలిజ వంశీకుడని చెబితే ఎందుకు అంగీకరించరు? సంపెట వారు అని చెప్పినప్పుడు గొప్ప చరిత్రకారుడు అయిన ఆచార్యుల వారు రాయలు బలిజ వంశీకుడని చెబితే ఆధారాలు లేవా? ఇదెక్కడి వాదన.

    ReplyDelete
  15. బలిజలు యాదవులు ఒక్కటే అని నేను వాదన చేయలేదు అనామకా. సాక్షాలతో నిరూపించాను. బాంబే గెజిట్, హైదరాబద్ గెజిట్ లను నేను రాయలేదు. పాపం ఎవరో తెల్లవాళ్ళు రాసారు. 126 సంవత్సరాల క్రితం రాసినవి.
    అప్పటికి నేనుకాదు మా తాతలు కూడా పుట్టలేదేమో. పిచ్చివాదన అన్నారు ఎవరికి ఎంత వెర్రి వుండేది లోకమంతా తెలుసు.
    సాక్ష్యాలను ఎదురుగా పెదితే కూడా పిచ్చివాదన అంటే మీ విజ్ఞత ఎంటో అర్ద్జమవుతోంది. ఒక్క సాక్ష్యం కూడ లేకుండా చర్చ భలేగా లాక్కొచ్చారు. మున్ముందైనా సాక్షాలతో వాదన చెస్తారని ఆశిస్తున్నాను.

    ReplyDelete
  16. ఇతర కులాల చరిత్రను చెప్పుకోవలసిన అగత్యం బలిజ కులస్తులకు లేదు. బలిజ కులస్తుల చరిత్ర చదివితే మీ కళ్ళు బైర్లు కమ్ముతాయి. ఇప్పటిదాకా మా డబ్బా నేను కొట్టుకొలేదు. పద్యాలను సైతం చదివి అర్థం చెసుకోలెని వారు చరిత్ర గురించి ఎలా తెలుసుకుంటారు. బాంబే గెజిట్ లో వున్న 56 దేశాలను పరిపాలించిన వారు గొల్లలా? లేక బలిజలా?

    "బలిజ వారిది భూమి బలుసమై వ్రాసి
    ఇసుక ముప్పిరిత్రాడు వెయ్యంగ నేర్చి
    కలిమి బలములకెల్ల ఘన పుణ్య రాశి
    కలనైన ధర్మముల్ ఘనత తో జేసి
    అయ్యావళి ముఖ్యమైనట్టి వారు
    కయ్యమందున కాలు కదిలించ బోరు
    నేయ్యమందు మహా నేర్పు గల వారు
    దివ్యతుల యాభై ఆరు దేశాల వారు బలిజ వారు"

    "తెలివినేబదియారు దేశాదిపతులుగా
    నిలుచుట బలిజ సింహాసనంబు,
    శరణాగతత్రాణ సద్బిరుదుభాసిల్లె
    ......... బలిజ సింహాసనంబు,
    మర్యాదమల్లని మాడ్కిని ధర్మంబు
    న్యాయంబు బలిజ సింహాసనంబు,
    త్యాగభోగంబుల దానకర్ణుని మించె
    నభివృద్ధి బలిజ సింహాసనంబు,
    మాళ వాంధ్ర మగధ కురూ లాట
    ........... ప్రభులు బలులు
    అద్భుతంబైన బలిజ సింహాసనంబు."

    చెన్నై లోని ఓరియంటల్ లైబ్రరి లో వున్న 10-16-10 అనే తాళపత్ర గ్రంధం సుమారు 1,000 సంవత్సరాల క్రితం రాసినది. మరి బాంబే గెజిట్ లో చెప్పిన 56 దెశాల పాలకులు గొల్లలా? బలిజలా? ఇవి కూడా శాంపిలే ఇంకా కోకొల్లల ఆధారాలు మా దగ్గర వున్నయి. మరి మీ దగ్గర....????
    ఇతర కులాల చరిత్రను మాది అంటూ చెప్పుకుంటున్నది ఎవరు?

    ReplyDelete
  17. మీరు యాదవులు గొల్లలు ఒకటే అని ఇంతవరకు నిరూపించే ఏ ఆధారాన్ని చూపించలేక పొయారు. పోనీ కుర్మి, కునిభి అఖిల భారత మహా సభ లు జరిగినప్పుడు మీరు ఏ రొజైన హజరయ్యరా 1894 లో కూర్మి క్షత్రియ మహాసభ ప్రారంభించబడింది. అప్పటినుంది ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లోని బలిజ కులస్తులకు మాత్రమే అహ్వానాలు అందుతున్నాయి. మీ గొల్లలకు ఒక్క సారైనా అహ్వానం అందిందా? మద్రాస్ ప్రెసిదెన్సి గవర్నర్ గా పని చేసిన కూర్మా వెంకటరెడ్డి నాయుడు గారు.1938 లో జరిగిన సభ లో పాల్గొని ప్రసంగించారు. ఎవరు ఇతర కులాల చరిత్రను తమదని చెప్పుకుని అడ్డంగా వాదిస్తున్నది...???

    ReplyDelete
    Replies
    1. మీ వాదన సరైన దారిలొ లేదు.ఎందుకంటె,మీరు సాక్ష్యం ఇచ్చిన ప్రతిదానికి నేను సమాధానం ఇచ్చినాను.వాటిని పరిగణలొకి తీసుకోకుండా,మీరు చెప్పిందే చెప్పుతున్నారు.పుటపర్తి వారిని నేను కించపర్చలేదు.కించపర్చను కూడా.వారి అభిప్రాయాలను మాత్రం చర్చిండం మాత్రం చేయాలిసి ఉంటుంది!పుటపర్తి వారివిగ మీరు ఆధారపడుతున్నవి పరీక్షకు నిలవవు.మరోసారి చెప్పుతున్నాను, పుటపర్తి వారి వద్ద క్రిష్నరాయల కులానికి సంబందించి ఎటువంటి తాళపత్ర గ్రంధం లేదు.ఆయన చెప్పినది కేవలం ఆయన అభిప్రాయం మాత్రమే.తన అభిప్రాయాలకి ఆయన ఏ ఆధారాలు చూపలేదు.ఆయన తాతాచార్యుల వంశీకుడనె ఒక్క ఆధారంతొ,అది మీకు అనుకూలంగా ఉండటంతొ మీరు ఆయనను పదె పదె తలుస్తున్నారు.పుటపర్తివారు క్రిష్నరాయలువారి ఇంటిపేరు సంపెట,రాయలు కమ్మగాని,బలిజగాని అవుతారని అన్నారని బండ్లమూడి సుబ్బారావు తన శ్రీక్రిష్నదేవరాయలు గ్రంధంలొ చెప్పినారు.దీనిని ఏమంటారు?

      Delete
    2. కుంభి వర్గం గురించి బాంబే గెజిట్లొ ఇచ్చిన సమాచారాన్ని ఇచ్చినారు.దానికి నేను సమాదానాన్ని ఇచ్చినాను.అది మీ కులానికి సంబందించినది కాదు అని చెప్పి ఉన్నాను.మళ్ళి చెప్పుతున్నాను,కుంభి అనెది ఒక కులం కాదు .మహారాష్ట్రంలొ వ్యవసాయాన్ని పూర్తి స్ధాయి వ్రుత్తిగ తీసుకున్న కొన్ని కులాలని కలిపి చెప్పె ఒక సూచక పదం.మీరిచ్చిన సమాచారం కుంభి వర్గంలోని ధంగర్ కులానికి చెందినది.తెలుసుకోవడానికి కనీసం kunbi ఇంగ్లీషు వెబ్సైట్ చూడమని సూచించాను.దానిని కాదనిగాని అవుననిగాని చెప్పలేదు.ఇంగ్లీషువారు బాంబె ప్రెసిడెంసి వెలుపల ఉన్న వ్యవసాయ కులాలను సూచించడానికి వారికి ముందు తెలిసిన కుంబి పదంతొ సూచించారు.అందుకే తెలుగు ప్రాంతాలలొ ఉన్న వ్యవసాయ కులాలని సూచించెటప్పుడూ కుంబి పదం ఉపయోగించారు.కుంబివర్గంలొని ఒక్కో కులాని గురించి చెప్పెటప్పుడుగాని, ఆ వర్గాని సూచించెటప్పుడు కూడా కుంబి పదంతొ సూచిండం పరిపాటి.మీరు చూసిన కుంబి కాపు ఒక్కటే అనె వాక్యం.కుంబివర్గంలొని ధంగర్ కులం యొక్క యదువంశం గురించి. మా కులం గురించి చెప్పారని మీరు బావించారు.కుంబి వర్గంలొని కులాలది,ఏ కులం చరిత్ర దానిదే.కాపు వర్గంలొ కూడా అనేకకులాలు ఉన్నాయి,ఊదాహరణకు వెలమ,రెడ్డి,కమ్మ,బలిజ వగైర.ఈ కులలకి ఏ కులం చరిత్ర ఆ కులానికి ఉన్నది.ఒకరి చరిత్ర ఒక కులనికి చెందదు!మీరు విచారన చేయకుండ, అనుకూలంగా ఉన్నదని దానిని పదే పదే చెప్పుకుంటున్నారు.నిజాన్ని చూడటానికి ఇష్టపడటంలేదు.

      Delete
  18. యాదవులు గొల్లలు వేరు వేరు అని ఒక వాదనను తెచ్చారు.దానికి కూడ నేను సమాదానం ఇచ్చినాను.అది పూర్తిగా ఆచరణలొ ఉన్నది,గ్రందస్తమైనది.ఒక ఉదాహరణగ నేను ఒక పుస్తకం సూచించాను.అది మీకు అందుబాటులొ లేకుంటె ఈ గ్రందాలను చదవండి.తంగిరాల వెంకట సుబ్బారావు రచించిన కాటమరాజు అనె గ్రంధాన్ని గాని,పలనాటి వీర చరిత్ర,మరియు క్రీడాభిరామం అనె గ్రందాలు.ఇవి మీకు అందుబాటులొనె ఉంటాయి.అప్పుడు యాదవులు గొల్లలు ఒకటేనని తెలుస్తుంది.అప్పటికి మీరు అదె వాదన చేస్తూ ఉంటే,మీరు ఉద్దేశ్యపూరకంగానే చేస్తున్నారని ప్రపంచానికి తెలుస్తుంది.

    ReplyDelete
  19. ఈసారి కూడ మరో వాదన తెచ్చారు. అది బలిజ పద్యాలు.ఇవి చరిత్ర నిర్మాణానికి పూర్తిగా ఉపయోగపడవు.అవి ఎప్పుడు వ్రాసారో తెలియదు,ఎవరు వ్రాసారో తెలియదు.మీరన్నట్టుగా అవి 1000 సంవత్సరాలవి అయితే,అవి అర్ధం చేసుకోవడానికి ముందు మద్య యుగాల భారతదేశ చరిత్ర యొక్క రాజకీయ,ఆర్దిక,సాంఘిక చరిత్ర తెలిసి ఉండాలి.మద్య యుగాలలొ బలిజ అనేది ఒక బలమైన వ్యాపార వర్గం.వ్యాపారం చేసేవారందరు ఒక సంఘంగా ఏర్పడి వ్యాపారం చేసేవారు.ఆ సంఘాలను బలిజ సమయాలు అంటారు.ఈ సమయాలకు ప్రతి రాజ్యంలొ వ్యపార స్తావరాలు ఉంటాయి.ఈ స్తావరాలను నకరాలు అంటారు.ఈ నకరాలు బలిజ సమయాల స్వయం పాలనలొ ఉంటాయి.ఈ సమయాలు ఆద్వర్యంలొ ఈ నకరాలు ఆర్ధికంగా,స్వయం పోషకాలు.స్వంత సైన్యాలు కలిగి ఉంటాయి.ఈ నకరాలు ఉన్న ప్రాంతము ఏ రాజు క్రిందకి పోయిన వారితొ పనిలేదు,వీటి పని వీటిదే.ఇవి చిన్న సైజు రాజ్యాలుగా ఉండేవి.అందుకే ఈ నకరాల ప్రముఖులు ప్రభువులుగానే సంభోదించబడేవారు.ఈ బలిజ నకరాలు ప్రతి రాజ్యంలోను ఉండేవి.మీరు తెచ్చిన పద్యాలను ఆ నేపద్యంలొ అవగాహన చేసుకోవాలి.బలిజ సిమ్హాసనం అంటే రాజకియ సిమ్హాసనమని కాదు,వ్యాపార సిమ్హాసనం.కావాలంటే మధ్య యుగ భారతదేశ చరిత్రలొ నిష్టాతులైన చరిత్రకారులను సంప్రదించవచ్చు! మీ దగ్గర మొత్తం తాళ పత్రం గ్రంధం ఉంటే ప్రచురిచండి.దాని పైన చరిత్రకారులలొ చర్చ జరుగుతుంది.నిజనిజాలు బయటకి వస్తాయి.

    ReplyDelete
  20. పారిజాతాపహరణంలొని మీరు చెప్పిన పద్యం యొక్క అర్ధం,నాడు వసుదేవుడకు కుమారుడిగ క్రిష్ణుడిగ పుట్టి యాదవత్వం వలన సిమ్హాసనస్తుడు కాలేక పోయిన ఆది నారాయణుడు,నేడు అదే యాదవ కులంలో నరసేంద్రుడీకి క్రిష్నరాయలగా పుట్టి సిమ్హాసనమధిష్టించి కీర్తిగాంచినాడు అని అర్ధం.దానికి మీవాళ్ళు ఏదేదో ఊహించుకొని గందరగొళం చెసుకుంటున్నారు.
    పుటపర్తివారు చూసార లేదా అనేది ఇప్పుడు అనవసరం.ఆయన చెప్పినదే లెక్క. మీ దగ్గర ఎన్ని ౠజువులున్నా సరె!చూపించండి!చుద్దాం!

    ReplyDelete
  21. కూర్మి కులం వేరు యాదవులు వేరు.వాళ్ళు యాదవులను ఎందుకు పిలుస్తారు!వారి సమానమైన కులాన్ని పిలుస్తారుగాని.మీ బలిజ కులంలాగే క్షత్రియ హొదా కోసం ఆనాడు కుర్మిలు కూడ ప్రయత్నిస్తూన్నారు, అ సమయంలొ మీ వారిని పిలిచారు.ఇప్పుడు కూడా పిలుస్తున్నారా?

    ReplyDelete
  22. అనామకుడు గారూ సాక్ష్యానికి సాక్ష్యమే సమధానమవుతుంది తప్ప నోటిమాట సమాధానం కాదు. పుట్టపర్తి వారి వద్ద కృష్ణరాయలు బలిజ అనే తాళపత్ర సాక్ష్యమేదీ వుండకపొవచ్చు కానీ ఆయన పరిశోధన లో రాయల కులం పైన నిర్ధిష్టాభిప్రాయానికి వచ్చి వుండవచ్చు. బండ్లమూడి సుబ్బారావు గారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే కమ్మకులం ఒకానొక సందర్భంలో బలిజ కులం నుండి విడిపోయింది కాబట్టి దీనికి ఆధారం పద్మనాయక విజయం లోని ఈ క్రింది పద్యం చూడండి

    ఊరి వరద నీరు - నురికి సరస్సు జేరి
    తీర్థ యోగమైన - తెరగు గాదే
    కాల చోదితమున - గాకతీశ్వరుల గొల్చి
    కాపులెల్ల వెలమ - కమ్మలైరి

    తొలికాల ముర్వి గొడవల
    వెలియై యాలయములందు విహరించుటచే
    నిల కాపు జనులు కొందరు
    వెలమలనన్ జగతిలోన - విశృతులగుటన్

    వెలమ కమ్మ కులాల వారు బలిజ కులం నుండి విడిపోయారు రాయల కాలం నాటికి వారి కులాలు లేవు. కనుక వారు రాయలు మావాడని చెప్పుకున్నా అది కొంతవరకు సమంజసమే. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లు ప్రాచీన భారతదేశ చరిత్రను తమ చరిత్ర అని చెప్పుకొవచ్చు. కానీ ఏ సంబంధం లేని గొల్ల కులస్తులు రాయలు మావాడని ఎలా చెప్పుకుంటారు?

    ReplyDelete
  23. నేను ఎంత మొత్తుకున్నా మీరు మాత్రం ఒక్క సాక్ష్యం కూడ చూపకుండా చర్చను నెట్టుకొస్తున్నారు. ఈది సరైన చర్చా విధానం కాదనుకొంటా. నిజాన్ని చూడకుండా పరిశీలించకుండా చరిత్రను నిర్మించడం అసాధ్యం. రాయలు బలిజ వంశీకుడని అడ్డంగా వాదించాలని అనుకోవడం లేదు నేను. ఆయన బలిజ వంశీకుడని మా వద్ద వున్న ఆధారాలను మాత్రమే చూపుతున్నాను. వాదనలను ఖండించడమే కాదు సరైన ఆధారాలను చూపడమే అసలైన చర్చా విధానం. నేను 30-4-2013 న పోస్ట్ చేసిన వ్యాఖ్య లోనే చెప్పాను ఒక కులాన్ని నిర్ణయించేది వారి బంధుత్వాలే మా బలిజ కులం లో రాయల వారికి సంబంధించిన 300 లకు పైగా బంధుత్వాలను నేను చూపిస్తాను మీ గొల్ల కులం లో మీరెన్ని చూపిస్తారు???
    మీరు 150 చుపించినా రాయలు మావాడు కాదని నేను ఒప్పుకుని నా తల మీ కాళ్ళ దగ్గర పెడ్తాను. రూ.1,00,000 లు మీకు చెల్లిస్తాను.

    అది కూడా శాసనాలలో చూపిన ఇండ్ల పేర్లు మాత్రమే. మీకు దమ్ము వుంటే నాకు ఫోన్ చేయండి. నా నెంబర్ పై పోస్టింగ్స్ లో ఇచ్చాను చూడండి.

    ReplyDelete
  24. మీరు పదే పదే సాక్ష్యం చూపాను,సాక్ష్యం చూపాను అంటున్నారు.మీరు చూపిన సాక్ష్యాలు 1.మీవి కాని వాటిని మీవని చెప్పుకున్నవి.2.అశాస్త్రియమైనవి.3 అసంధర్బమైనవి.
    బొంబే గెజిట్ సాక్ష్యం బలిజలది కాదు.అది ధంగర కులస్తులది అందుకు సాక్ష్యంగ నేను kunbi అనే ఇంగ్లీషు సైట్ని సాక్ష్యంగా చుపినాను.అది తప్పు అని మీరు ఋజువు చేయలేదు.కాని నాది సాక్ష్యాం,నాది సాక్ష్యం అని పదే,పదే అంటున్నారు!
    గొల్లలు,యాదవులు ఒకటి కాదన్న మీ వాదన తప్పని,అందుకు ఋజువుగా నేను martial races of undivided india అనే గ్రంధాని,కాటమరాజు అనె గ్రంధాని,పలనాటి వీర చరిత్ర అనె గ్రంధాలను సాక్ష్యంగా ఇచ్చినాను. వాటిని చదివి,కొంత సామయమైన తీసుకొని, నావాదన తప్పు అని అంటే బాగుండేది.కాని మీరు ఆ పని చేయకుండా,నేను సాక్ష్యం ఇచ్చినాను,మీరు చూపలేదు అంటు కూర్చున్నారు. ఈ విషయంలొ ఎవరు ఏమి వ్రాసినా కుడా,అది యాదవులు గురించిగాని,బలిజల గురించిగాని,పరీక్షకు నిలిసిన తరువాతనే అంగికరిచవలసి ఉండును.యాదవులు, గొల్లలు ఒకటే అని ఆనాదిగా తెలిసిన వీషయమే. ఈ విషయంలొ Anthropology department of india వారు ఏదైన నివేదిక ఇచ్చివుంటే అది పరిసిలించవలసిన అంశం.అప్పుడైన సంబందిచిన వర్గాలు పిటిషన్ పెట్ట కుండా ఉంటే .

    ReplyDelete
  25. మీ బలిజ పద్యాలకి క్రిష్నరాయల కులానికి సంబందం లేదు.ఆ పద్యాలు ఏ నేపద్యంలొ అర్దం చేసుకోవాలొ నేను వివరణ ఇచ్చినాను,అది చరిత్ర గ్రంధాల ఆధారంగా చేసినది.అది మీకు రుచించదని ఎవరికైన తెలుసు.మీరు ఆ పద్యాలను మీ కోణంలొ అర్దం చేసుకోవడానికే ఇష్టపడ్డటారు.బలిజ సిమ్హాసనం యొక్క అర్దం రాజకీయ అదికారం కాదు,వాణిజ్యపరమైన పలుకుబడి.ఆంధ్రదేశ సాంఘిక-ఆర్ధిక చరిత్ర (శాసనాలు,సాహిత్యం ఆధారంగా) క్రీ.శ.1300-1600.రచయిత కాణిపాకం చెంగల్ రాయశెట్టి చదవండి.మీ అంతట మీరే తేలుసుకుంటారు. ,

    ReplyDelete
  26. మీ బలిజ పద్యాలకి క్రిష్నరాయల కులానికి సంబందం లేదు.ఆ పద్యాలు ఏ నేపద్యంలొ అర్దం చేసుకోవాలొ నేను వివరణ ఇచ్చినాను,అది చరిత్ర గ్రంధాల ఆధారంగా చేసినది.అది మీకు రుచించదని ఎవరికైన తెలుసు.మీరు ఆ పద్యాలను మీ కోణంలొ అర్దం చేసుకోవడానికే ఇష్టపడ్డటారు.బలిజ సిమ్హాసనం యొక్క అర్దం రాజకీయ అదికారం కాదు,వాణిజ్యపరమైన పలుకుబడి.ఆంధ్రదేశ సాంఘిక-ఆర్ధిక చరిత్ర (శాసనాలు,సాహిత్యం ఆధారంగా) క్రీ.శ.1300-1600.రచయిత కాణిపాకం చెంగల్ రాయశెట్టి చదవండి.మీ అంతట మీరే తేలుసుకుంటారు. ,

    ReplyDelete
  27. ఇంటి పేరుల్ విదానం చాలా ఆశాస్త్రియమైనదని ముందే చెప్పను.దీనిని ఏ చరిత్రకాడు అంగీకరిచడు. కావాలంటే చరిత్రకారులతో సంప్రదించండి.కవున దానిని పట్టుకొని పదే పదే వ్రేలాడకండి.రాయలు నేను బలిజ కులస్తుడను అని చెప్పి ఉంటే అది చూపండి.అప్పుడు ఏవరైన నమ్ముతారు.అంతేగాని ఆశాస్త్రియమైనవి పట్టుకొచ్చిఏవరు అంగీకరించరు.రయాలు బలిజ కాడని చరిత్రకారులకు తేలుసు.ఏదోకవిదంగా మావాడు అనిపిచుకోవాడానికి చిత్రవిచిత్ర వాదనలను చేస్తూవున్నారు.స్పష్టమైన ఆధారాలు ఉంటే చర్చకురాండి!

    ReplyDelete
  28. బాంబే గెజిట్ లో ఇచ్చిన 96 తెగలు గా వుండి 56 దేశాలు పరిపాలించినవారు, తాళపత్ర గ్రంధం లో వున్న 56 దేశాల పాలకులు ఒకటి కాదంటారు... అంతేనా...పైన నేను చూపిన గెజిట్ లన్నీ తప్పులంటారు అంతేగా.... హైదరాబాద్ గెజిట్ లో వున్న కాపులు కూడా బలిజలు కాదంటారు అంతేనా... మంచిది వారంతా ఎవరో... రయలు బలిజ కాదని చరిత్రకారులకు తెలుసు అన్నారు ఎవరో ఆ చరిత్రకారులు పేరు చెప్పుకోవడానికి కూడా ధైర్యం లేని వారా... అసలు శాస్త్రీయతకు అశాస్త్రీయతకు తేడా తెలుసా మీకు
    నేను బాంబే గెజిట్ ను కునిభి లు యాదవులు ఒకటే అని నిరూపించడానికి సాక్ష్యంగా ఇచ్చాను. ఇక హైదరాబాద్ గెజిట్ ను కునిభి లు కాపులు ఒకటే అన్న దానికి సాక్ష్యం గా ఇచ్చాను.
    ఇక బలిజ పద్యాల విషయానికి వస్తే బాంబే గెజిట్లో వున్న 56 దేశాలను పాలించిన కునిభిలు చెన్నై లోని ఓరియంటల్ లైబ్రరి లో వున్న 10-16-10 అనే తాళపత్ర గ్రంధం లో వున్న 56 దెశాలను పాలించిన బలిజలు ఒకటే అని నిరూపించాను. ఈవన్నీ ఎందుకు ఇచ్చాను అంటే యాదవులు బలిజలు ఒకటేనా అని మీరు సందేహం లేవనెత్తారు అందుకు ఇవన్నీ ఇవాల్సి వచ్చింది. నేను చేసిన సవాల్ కు మీరు బదులు ఇవ్వలేకపోయారు. ఇంటిపేర్లు శాస్త్రీయతకు నిలవవు అంటున్నారు. మరి శాస్త్రీయతకు ఏమి నిలుస్తాయో... మధుర, తంజావూరు, మైసూరు, రాజులంతా రాయల బంధువులని నాయక రాజులని ఒప్పుకుంటారా లేక కాదని వాదిస్తారా?
    మధురను పరిపాలించిన విజయరంగ చొక్కనాథుడు శ్రీరంగం లోని రంగనాథ స్వామి ఆలయ గోడలపై రాజ బంధువులు, మహాబంధువులు, గోష్టి బంధువులు,బహు బంధు వర్గం అంటూ 200లకి పైగా ఇండ్లపేర్లు చెక్కించారు. ఆ పేర్లు అన్నీ బలిజ కులం లో వున్నాయి మీ గొల్ల కులంలో ఒక 100 అయినా చూపగలరా??? విజయనగరాన్ని పరిపాలించిన అన్ని రాజవంశాలు బంధువర్గమే. ఇది కూడా అశాస్త్రీయమే అంటారా...

    మరి శాస్త్రీయం ఏమిటో ఎలా నిరూపించాలో చెబితే అలా నిరూపించడానికి ప్రయత్నిస్తా ఊరూ పేరు లేని అనామకా....

    ReplyDelete
  29. maatladite chalu gollalu gollalu amtaaru abhi gaaru meeru samskaaravamtam gaa maatladite bagumtumdi

    ReplyDelete
  30. e charchanu gamanistunnanu anna Anonymous e carchalO abhi gaaru remdu saarlu savaal visiraaru. daaniki meru spamdimchaledu. aa pamdem Rs.1,00,000 lu nenu kattagalanu. mee account no.ceppamdi TV5, V6, channels lO maa friends vunnaaru vaariki ceppi charcha arrange chestaanu. deeniki meeriddaru siddamaa cheppamdi.

    ReplyDelete
  31. మీరు ఇప్పటివరకు నమ్ముతువచ్చిన్ దానిని కాదనటం వలన అంగీకరించడానికి ఇష్టపడలేకున్నరు.బంబే గెజిట్ సమాచారం బలిజ కులనిది కాదు!కుంబి కాపు పదాలు రెండు స్టేట్లలోని రేండు వ్యవసాయ వర్గాలను సూచించే పదాలు మాత్రమే.అవి వ్యక్తిగత కులాలు కావు.మీ లక్ష్యాలకి ఉపయొగ పడతాయాని మీరు అ సమాచారన్ని కోట్ చేయడం జరుగుతుంది. మీరు వాటిని విస్త్రుత అవగాహనతో కాకుండా పరిమిత అర్దంలొ చూస్తున్నారు. నా వివ్రణ మళ్ళీ చదవండీ.సరైన దిసలొ అవగహనకు ఉపయొగపడుతుందని kunbi సైట్ సూచించినాను.దానిని పరిగనలోకి తీసుకున్నట్లు లేదు!బలిజలు యాదవులు ఒకటి కాదు.బలిజ కులం గురించి సరైన అవగాహ్నకు చరిత్ర గ్రందాలు చదవండి.

    రాయలు బలిజ కాదని చెప్పిన చరిత్రకరులు ఎవరని అడిగినారు.విజయనగర చరిత్ర పై చాల గ్రాంధాలు ఇంగ్లీషులొ ఉన్నాయి.వాటిని చదవండి.టివి9 కన్నడ చానల్లొ దేవదేవ అనే కార్యక్రమం వచ్చినది అది చూడమని నేను చూడమని సూచించాను.ఆ కార్యక్రమే రాయలు యాదవుడా! కాపా! అనే అంశం పై జరిగినది. యుటుబ్లొ చూసే ఉంటారు.

    ReplyDelete
  32. శాస్త్రియతకి అశాస్త్రియతకి బేదం అడిగినారు.నేను ఏ విషయములొ శాస్త్రియత ఏమిటో స్పస్టాంగా చెప్పినాను.మీరు అర్ధం చేసుకోవటానికి ఇస్టపడలేకపోతున్నారు.

    బలిజ పద్యలలోని 56 దేశాలకి,బంబే గెజిట్లోని 56 దేశలకి తేడా ఉన్నది.బంబే గెజిత్ 56 దేశాలు రాజులకి చెందినవి,బలిజ పద్యల 56దేశాలు బలిజ(వ్యపార)సమయాలకు చెందినది.ఆ విషంలో నేను వివరంగా చర్చించాను. ఒక బుక్ పేరు కూడా చెప్పినాను.పై పై పోలికలు చూసి తొందారగా ఒక నిర్నాయనికి వచ్చారు.దానికి భిన్నమైన అభిప్రాయాన్ని అంగికరించలేకపోతున్నారు.

    నాయక రాజులు గురించి అడిగినారు. మదుర,తంజవురు నాయక రాజులు బలిజలు.మైసూరు రాజులు యాదవ రాజులు.ఆ వంశం ఇప్పటికి ఉన్నది మీవరు అక్కడ ఉన్నారు,వారి ద్వారా తెలుసుకోవచ్చు. నైసూరు రాజులు రాయలవారి బంధువులే. మదుర,తంజావురు నాయక రాజులు బందువులు కాదు.

    రంగనాధ స్వామి ఆలయంలోని చొక్కనాదుని లిస్టు,చొక్కనాదుని బందువులే.కాని వారు రాయల బందువులు కాదు.ఇరువురు వేరు వేరు.మీ బందుత్వాల వాదన పై విస్త్రూతమైన ప్రచారం చేసి చరిత్రకారులతొ ఒక సెమినారు పెట్టి నిజ నిజాలు తెలుస్తాయి.

    ReplyDelete
  33. అభిగారు, మీరు కుంభి వర్గం గురించి,కాపు వర్గం గురించి,బలిజ కుల ఆవిర్భావం గురించి వాస్తవ ద్రుష్టితొ అవగాహన చేసుకోండి.చర్చంటె రోజువారి పద్ధతిలొ జరగాలని లేదు.బలిజలు వేరు యాదవులు వేరు.నేను చెప్పిన బుక్స్ చదవండి.

    ReplyDelete
  34. గొల్లలు మరియు యాదవులు

    గొల్లలు ఉత్తరభారతదేశపు యాదవులకు చెందినవారని కొంతమంది అభిప్రాయపడుతుంటారు. . పాడిపశువులను మేపుకోవడమే వృత్తిగా ఎంచుకొన్న తెగలు దేశంలో చాలా ఉన్నాయి. ఉత్తర భారత దేశంలో అహిర్ తెగలు పాడిపశువులను మేపుకొన్నారు. ఆలాగే దక్షిణ భారత దేశంలో గొల్ల కులస్తులు పాడిపశువులను మేపుకొన్నారు. సంసృత మహాభారతాన్ని తెలుగులోకి అనువదించేసరికి యాదవులు తెలుగువారికి గొల్లవారిగా పరిచయమయ్యారు, కుల వృత్తులు ఒక్కటే కావడంతో యాదవులు కూడా తమ కులస్తులేనని గొల్లవారు భావిస్తారు. ఆంధ్ర రాష్ట్రంలో అనేక రాజకీయ కారణాల వల్ల యాదవ గొల్ల అనే ఉప కులము ఏర్పడింది.
    "యాదవ" సంస్కృతి పైకి అడంబరంగా కనిపిస్తూనే ఉంది. ఉత్తర భారత రాజకీయాలు "యాదవ" పదానికి ఉన్నత స్థితిని కల్పించాయి. సామాజికంగా, ఆర్థికంగా ఎదిగిన గొల్ల కురుమల చేతిలో ఆ పదం ఆయుధమైంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లోని గొల్లకురుమల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుంది. ఆయా ప్రభుత్వాలు గొల్లకురుమలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతున్నాయి. పైగా, తాతముత్తాతల నుంచి వస్తున్న వృత్తి "కార్టోరేట్‌రూపు" ధరించి అగ్రకులాల చేతుల్లోకిపోతోంది.
    గొల్ల కురుమలలో మొత్తం 25ఉపకులాలున్నాయి. గొల్లలను కురుమగొల్లలని కూడా అంటారు. మొత్తం రాష్ట్ర జనాభాలలో 18-20 శాతం వరకు గొల్లకురుమలుంటారని ఒక అంచనా. అయితే గొల్లకురుమల పరిస్థితి ఏ మాత్రం మెరుగ్గాలేదని వారికోసం కృషిచేస్తున్న కులసంఘాల నాయకులంటున్నారు.
    గొల్ల-కురుమల ముఖ్యవృత్తి మాంసోత్పత్తి, పాల ఉత్పత్తి. పాల ఉత్పత్తులు పెరుగు, వెన్న, నెయ్యి తయారుచేసీ విక్రయించే పని గొల్ల స్త్రిలది. గొల్లకురుమలు నేడు ప్రధానంగా గొర్రెల, మేకల పెంపకందార్లుగానే పల్లెల్లో మిగిలారు. ఆవులు, ఎద్దుల పెంపకం చాలా వరకు వాళ్ళ చేతుల్లోంచి జారిపోయినట్లే. వ్యవసాయం చేసే అగ్రకుల శూద్రుల్లోకి ఆవుల మందలు వెళ్ళిపోయాయి. హైదారాబాద్ నగరంలో బర్రెల పంపకం, వాటి పాల విక్రయం గొల్లల చేతుల్లోనే చాలా వరకు ఉన్నప్పటికీ గ్రామాల్లో వారి చేతుల్లో లేకుండా పోయింది. గొల్ల, కురుమలు వ్యవసాయం చేయడం కూడా గ్రామాల్లో చూస్తాం - గొంగళ్ళునేయడం కూడా గ్రామాల్లో చూస్తాం - గొంగళ్ళు నేయడం కూడా గొల్లకురుమల వృత్తి.
    భూస్వాముల చెలకల్లో "మందలు" పెట్టి వారి భూములకు ఎరువును అందించే గొల్లకురుమలు ఎళ్లవేళలా చెట్లూ, పుట్టలూ పట్టుకుని తిరిగే సంచారజీవులు. అయితే ఈ వృత్తిని కాపాడుకోలేని దుస్థితిలో నేడు గొల్ల కురుమలున్నారు. మేకలను, గొర్రెలను మేపుకోవడానికి పచ్చిక మైదానాలు లేక నీరు లేక వారు నానా అవస్థలు పడుతున్నారు. గొల్లలు వ్యవసాయంలోకి వచ్చినప్పటికీ చదువు సంధ్యలు వైపు దృష్టి మరల్చలేదు. ఆ కారణంగా వారు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడే వున్నారు


    http://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B1%8A%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2


    మిత్రమా అనామకా ఈ పైన రాసిన రాతలు నేను రాసినవి కావు. తెలుగు వికిపీడియా లో వున్న యదార్థం.

    ReplyDelete
  35. మిత్రమా మేము 18 1/2(పద్దెనిమిదిన్నర) పూర్వాచార కులాలకు పెద్దలం. దీనిని శెట్టిసమ్మే అంటారు. ఈ ఆచారం ఎప్పుడు ప్రారంభమైందో చెప్పలెము. ఈ పద్దెనిమిదిన్నర కులాలలో మీరు కూడా ఒకరు. మా బంధువులు రక్తబంధువులు అయితే పద్దెనిమిదిన్నర కులాల వారు మా ఆత్మబంధువులు. మిమ్మల్ని కించపరచడమంటే అది నాకు కూడా బాధ కలిగించే అంశమే. వాస్తవాలు వెలికి రావాలనే కొన్ని పరుషపదాలు వాడాను. ఊరు పేరు లేని వారితో వాదన చేయకూడదనేది. తర్కం లో ప్రధాన విషయం. ఇక రెండవ అంశం అవతలి వ్యక్తి స్థాయి సమానమైనదైనప్పుడే వాదనకు దిగాలి. ఇక మూడవ అంశం ఇరువ్యక్తుల పై ఎలాంటి రాగద్వేషాలు లేని వ్యక్తి మధ్యవర్తిగా వుండాలి. అప్పుడే ఆ చర్చకు సార్థకత వుంటుంది. మన చర్చ లో ఇవేమీ లేవు. కనుక మన చర్చకు ప్రయోజనం వుండదు. తమ్ముడు వందన దాస్ టివి.9,టివీ.5 లో చర్చ పెడతానంటున్నాడు కదా అలాగే చేద్దాం. మీరు ఎప్పుడు రమ్మన్నా నేను చర్చకు సిద్దం. నా రూ.1,00,000/- తో ఎక్కడకు రమ్మన్నా వస్తాను. మనం ఘర్షణ వాతవరణం లో చర్చ సాగించే కంటే శాంతియుతంగా వాస్తవాలు వెలికి తీద్దాం. రాయలు బలిజ కులస్తుడు కాదు అని రుజువైనా నేను చాలా సులభంగా జీర్ణించుకోగలను. ఎందుకంటే ఎవరి తండ్రినో నా తండ్రి అని చెప్పుకోవడంలో ఎవరికీ ఆనందం వుండదు.

    ReplyDelete
  36. మిత్రమా,అభిగారు,మీరిచ్చిన కురుమ సమాచారం పాక్షికమైనది.ఈ వాదనకు అసలు సంబదం లేనిది.వాదన ఎవరు చెసారు అన్నది కాదు.వాదన సరిగా చేస్తున్నారా లేదా అన్నదే లెక్క? మీరిచ్చిన ఇంఫొర్మెషన్ వారి ప్రస్తుత పరిస్తితి.దానికి ఈ వాదనకి సంబందం లేదు!యాదవ కులం బలిజ కులం కంటే ప్రాచీనమైనది.బలిజలకి యాదవులకి బంధుత్వాలు లేవు.వ్యక్తుల స్తాయిలొ ఉండొచుఏమొ?మీరు కటినంగా మాట్లాడిన,మరో రకంగా మాట్లాడిన వాస్తవం వాస్తవమే.

    1.బలిజలు యాదవులు ఒక్కటి కాదు.
    2.యాదవ అన్నా గొల్ల అన్నా ఒక్కటే.
    3.రాయలు బలిజ కాదు.

    పైవన్ని వాస్తవాలు.ఎక్కడ చర్చ చేసినా ఇదే తేలేది.

    ReplyDelete
  37. నిజమే కుందేలుకు కాళ్ళు మూడే ఉంటాయి. ఎంతటివాడికైనా వేపకాయంత వుంటుంది అంటారు పెద్దలు నిజమే నీకు వేపకాయంత కొంచెమేం కాదు తాటికాయ అంత వుంది. ఓకే...

    తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు
    తవిలి మృగ తృష్ణలో నీరు త్రావ వచ్చు
    తివిరి కుందేటి కొమ్ము సాధించవచ్చు
    ..........................

    నీ ఎదుటకు రాయలు వచ్చి నేను బలిజ అన్నా కూడా
    కాదు నువ్వు గొల్లవాడివే అంటావు నీవు.

    పేరు చెప్పలేవు
    లక్ష రూపాయల పందెం అంటే దాని గురించి మాట్లాడే దమ్ము లేదు నీకు

    నువ్వేంటో అర్థం అయింది

    నిజమే నీకు తాటికాయంతుంది.

    బెస్టాఫ్ లక్ ఆ తాటికాయంత దాన్ని మరింత పెంచుకో...

    ReplyDelete
  38. మిస్టర్ నువ్వెవరో తెలిసి పొయింది. ఇప్పటిదాక నీ పై నాకు గౌరవభావం వుండేది. నేను ఇచ్చిన గొల్ల వికిపీడియా సమాచారాన్ని ఎప్పుడైతే ఎడిట్ చేశావో నీకు తెలియకుండానే బయట పడ్డావు ఒక సమాచారాన్ని సిగ్గు లేకుండా ఎడిట్ చేయడమే కాకుండా దాన్ని కనుమరుగు చేయడానికి ప్రయత్నించావు. నీ లాంటి వారి వల్లనే పాపం అమాయకులైన గొల్లలు మోసపోతున్నారు నువ్వు చెశ్తున్న పని కరెక్టొ కాదో నువ్వే తేల్చుకో. నన్ను మోసం చేస్తే చెయ్యొచ్చు కానీ నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు సొ బ్యాడ్ లక్. నీ లాంటి వాళ్ళు బ్లాగ్ లు మెయింటైన్ చేయడానికి గానీ చరిత్ర పుస్తకాలు రాయడనికి గానీ పనికి రారు. నువ్వు రాసిన గండికోట కూడా నాతో చేసిన వాదనలాగే వుంటుందని అర్థం అయింది. గుడ్ బై ...

    ReplyDelete
  39. అభిమన్యు గారు..! మీరు పొరబడ్డారు. మీతో వాదోపవాదాలు చేసిన అనామక వ్యక్తికీ, గండికోట పుస్తక రచయిత ఐన ఈ బ్లాగ్ నిర్వాహకుడినైన నాకు ఎలాంటి సంబంధం లేదు. వికిపిడియా ను ఎడిట్ చేశారని మీరు చెబుతున్న విషయంతో కూడా నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎంతో ఆసక్తికరంగా సాగిన చర్చకు మీ అపార్థం కారణంగా ఆటంకం కలిగింది. ఎంతో ప్రజాస్వామ్య పద్దతిలో చర్చకు అవకాశం కలిగించిన బ్లాగ్ నిర్వాహకుడిని అయిన నన్ను అపార్థం చేసుకోవడం తగదు..అభి గారు..!

    ReplyDelete
    Replies
    1. GOLLALU YADAVULU OKKARE POORVAM ELAGE VADANU JARAGAGA ALLINDIA YADAVA MAHASBA VARU SARI IANA ADHARALU CHUPAGA CENRALGOVENAMENT 1920 LO GOLLALU CHANDRAVAMSA KSTHRUYLIANA YADAVULANI SRIKRISHNUNI VAMSUJULANI SPASSTANAGA PRAKATANCHINADI PULIYADAV

      Delete
    2. GOLLALU YADAVULU OKKARE POORVAM ELAGE VADANULU JARAGAGA ALL INDIA YADAVA MAHASABHAVARU SARI IANA ADHAARAALUCHUPAGA CENTRAL GOVERNAMENT 1920 LO GOLLALU CHANDRAVAMSA KSHATRIYULAINA YADAVULANI SRIKRISHUNUNI VAMSUJALANI PARLAMENT LO SPASTANGA PRAKATINCHINADI . GOOGLE LOYADAVHISTORY HOME CHUDANDI PULIYADAV

      Delete
    3. gollalu yadavulani madras governament13 december 1930 prakatinchinadi order No5240 law(general) gollalu yadavu okkare anadaniki inkaa chalaa adharalunnali puli yadav

      Delete
  40. సారీ... ఓబులరెడ్డి గారూ... మిమ్మల్ని నిజంగానే అపార్థం చేసుకున్నాను. నాతో వాదోపవాదాలు చేసిన వ్యక్తి పేరు సి.హెచ్.వెంకటేశ్వర్లు, గుంటూరు లో వుంటారు. నిజానిజాలు తెలుసుకోకుండా మిమ్ములను నొప్పించినందులకు క్షంతవ్యుడిని.జర్నల్ కు జనరల్ కు తేడా తెలియని వ్యక్తులతో వాదన అవసరమంటారా? వాదానికి వితండవాదానికి చాలా వ్యత్యాసముంది.

    వాస్తవాలు తెలుసుకోవాలని వాదన చేస్తే దానికి అందరి మన్ననలు లభిస్తాయి.

    ఓబులరెడ్డి గారూ నా 17 సంవత్సరాల జర్నలిజం జీవితం లో ఇలాంటి అనామకులను చాలా మందిని చూశాను. ఒక్క రోజులో ఈ అనామకుని పేరు, ఊరు కనుక్కున్నాను. మరో 24 గంటల లోపు ఇతడి సెల్ నెంబర్ పోస్ట్ చేస్తాను. ఇలాంటి వారితో వాదిస్తే జ్ఞానం కలుగక పోగా వున్నది కూడా పోగొట్టుకునే ప్రమాదం పొంచివుంది.

    ReplyDelete
  41. అభిమన్యు గారు! నిజం తెలుసున్నందుకు సంతోషం! ఈ బ్లాగ్ ద్వారా మన మధ్య ఏర్పడిన పరిచయం సదా కొనసాగాలని కోరుకుంటున్నాను. ఇలాంటి అపార్థాలకు ఇకపై చోటు లేకుండా ఉండేందుకు అనానిమస్ గా వచ్చే కామెంట్స్ ప్రచురించకూడదని నిర్ణయించడమైనది.

    ReplyDelete
  42. మిత్రమా అభిగారు,నేను ఈ చర్చలోకి వచ్చినప్పుడు అన్ని అప్షన్స్ కంటె ananymous అనేది చాలా సులభంగా ఉన్నది,నేను దానినే కొనసాగించాను.పేరు దాచుకోవలసిన అవసరం లేదు.నా పేరు వేంకటేశ్వరరావు.ఓబుల రెడ్డిగారికి సంబందం లేదు.

    నాకు ఏ కులం పట్ల అభిమానం గాని ,వ్యతిరేకత లేదు.ఎవరి చరిత్ర వారికే చెందాలనేది నా అభిమతం.చరిత్ర నా అభిమాన విషయం. అందున కుల చరిత్రలంటే మరీ ఇష్టం.ఏ డేశ చరిత్ర ఆయిన అన్ని కులాలు అన్ని వర్గాలు క్రుషి కలిస్తే ఏర్పడినదే.

    యాదకులం చాల ప్రాచినమైన కులాలలొ ఒకటి.చాల విస్త్రుతమైనది.దేశమంతటా వ్యాపించినది.శాకోపశాఖలుగా విస్తరించినది.దీని యొక్క శాఖలే కొన్ని సార్లు ప్రత్యేక కులాలుగా పరిగణిచబడుతున్నాయి.ఊదా: జాట్,గుజ్జర్,మాధురీలు వగైర.ఈ కులం గురించి అద్యాయనం చేసేటప్పుడు కొందరు ఈ అసంఖ్యకమైన శాఖలను చూసి,ఈ శాఖలన్ని యాదవులుగా పరిగనించబడటం చూసి ఇవన్ని వేరువేరు పేరులున్న పశుపాలక కులాలు లేక తెగలు,అందరిది పశుపలన కాబట్టి అందరు యాదవులు అని చేప్పుకుంటున్నారు అని భావిచడం జరిగినది.అటువంటిదే మీరు చూసిన గొల్ల వికిపిడియ సమాచారం.అది ఆ వికిపిడియ నిర్వాహకులు ఒక సైడు వాదనా సమచారాన్ని అందించినారు.వికిపిడియాలు ఎప్పుడు సమగ్రమైన సమాచారాన్ని ఇవ్వలేవు.ఒక స్తూలమైన అవగాహనకు అవసరమైన సమాచారాన్ని మాత్రమే ఇవ్వగలవు.ఇంకా కావలసినవారు ఇతర గ్రంధాలను చదివి లోతైన అవగాహన పెంచుకోవాలి.

    ప్రాచీన భారత దేశ చరిత్రకు సంబందించిన అనేక గ్రంధాలు వుంటాయి.వాటితొ ప్రారంబించండి.
    భారతదేశ చరిత్ర గ్రంధాలలో ఎక్కడా బలిజలు,యాదవులవుతారని లేదు.బలిజ ధర్మం గురించి ప్రస్తావన మద్యయుగం తొలినాటి నుండి కనిపిస్తూంది.అప్పటినుండైన బలిజలు,యాదవులవుతారని ఎక్కాడా ప్రస్తావించలేదు.అది మీరు గుర్తిచాలి.ఇప్పటివరకు వ్రాయబడ్డ బలిజ పురాణాలలొ కూడా వ్రాయబడలేదు.ఇటీవల కాలంలో ఈ వాదనలు వస్తున్నాయి.అదీ చరిత్రకారులనుండి కాదు.బలిజ కులస్తులనుండి.

    ఇక రాయలుగారి గురించి,రాయలు ఎదురుగా వచ్చి నేను బలిజ అన్నా కాదు అంటారు అని అన్నారు.అదే జరిగితే ఈ అనేక వాదనల అవసరము ఉండదు కదా!అది జరగదు కాబట్టే ప్రతి ఒక్కరు ఒక రాయెసిపోతున్నారు.

    ఈ విషయములొ టివి9 చర్చలొ యాదవ మహసభ ప్రతినిది ఒక ప్రతిపాదన చేసారు.రాయలు మావాడు అనే వారందరు ఆంధ్రప్రదేశ్,కర్నాటక,తమిలనాడు రాష్ట్రప్రభుత్వాలను అభ్యర్దించి నిపుణుల కమిటి వేపించుకొని ఆ కమిటికి, ఆసక్తి ఉన్నవారు వారి వారి ఆధారాలను సమర్పించితే ఆ కమిటి వారు ఏది నిర్ణయిస్తే దానిని అందరం అంగీకరిద్దాం అనెది అ ప్రతిపాదన.ఈ విషయంలొ మీరు చాల పట్టుదలతో ఉన్నారు,ఆ ప్రతిపాదనను ఆలొచించ వచ్చు గదా!

    రాయలులాంటి ఖ్యాతిగాంచిన వ్యక్తి మావడైతే బాగుండుగదా అని ఆశ పడటంలొ తప్పు లేదు.కాని చరిత్ర అంగీకరించాలి కదా! అందుకు చరిత్రనే మార్చగూడదు కదా! ఎస్వీ.రంగారావుగారు బలిజ కులంలో పుట్టినాడు,కొంత కాలం గడిచిన తరువత ఆయన మా కులస్తుడు అని వేరే కులాలువారు అంటే సబబు కాదు కదా!

    రాయల గురించి బలిజల నుండి వచ్చిన వాదనలు,
    1.రాయలు తల్లి బలిజ కులస్తురాలు కాబట్టి రాయలు మా కులస్తుడే.
    2.అచ్యుతరాయల బలిజ కులస్తురాలైన తిరుమలాంబను చేసుకున్నాడు కాబట్టి అచ్యుతరాయలు బలిజ తద్వార క్రిష్నరాయలు కూడ బలిజ.
    3రాయలవారి బంధువుల ఇంటి పేరులు కలిగిన వారు బలిజలలొ ఉన్నారు కాబట్టి రాయలు కూడ బలిజ.
    4.రాయలు యాదవుడను అన్నాడు కాబట్టి బలిజలు కూడ యాదవులే కాబట్టి రాయలువారు బలిజ.

    ఈ వాదనలు చుస్తేనే తెలుస్తుంది కదా,రాయలు మావడనిపించుకోవడాని ఎంత ప్రయత్నిస్తున్నారో! ఒక్కొక్కసారి ఒక్కొ వాదన.ఇవన్ని మీకు తెలిసేవుంటాయి కదా!

    పంతాలకి పట్టింపులకి పోవల్సిన పని లేదు,హేతుబద్దంగా ఆలొచించితే చాలు అన్ని పరిష్కరించబడతాయి. దీనికి ఆవేశాలు అక్కరలేదు.

    నేను మీకు వాస్తవన్నే చెప్పానని నమ్ముతున్నాను.

    ReplyDelete
  43. తవ్వా ఓబులరెడ్డిగారికి మనవి,ananymous అని ఉంటే కామెంట్ పొస్టింగ్ చేయడానికి అవ్స్కాసం ఇవ్వనన్నారు,అటువంటి పని చేయకండి.అందరికి అకౌంట్స్ ఉండాలని లేదు.వారికి ఇది చాల సులబంగా ఉన్నది.ఈ పేరు క్రింద వ్రాసిన వారు అసబ్యమైన,అసందర్బమైన లేక వ్యక్తిగత దూషనలు చేస్తుంటే వాతిని మీరు తొలగించండీ.మంచిగా ఉన్నవాటికి,దయచేసి, అవకాశం ఇవ్వండి.ఇప్పుడె చూసాను,కొందరు అననిమస్ పెరు క్రింద వారికి తెలిసిన సమాచారం ఇచ్చినారు. అటువంటీ అవ్కాషాలు లేకుండా పోతుంది కదా!నా మనవి పరిశీలించంగలరు.

    ReplyDelete
  44. అభిగారు మీరిచ్చిన వికిపిడియ సమాచారంలొ రెండు అంశాలు ఉన్నాయి.అవి:
    1.సంస్క్రుత మహాభారతమును తర్జూమ చేస్తునప్పుడు కవులు యాదవ అనె పదాని గొల్లగా వ్రాసినారు.దక్షిణ భారత గొల్లలు కూడా యాదవులమని చెప్పుకొంటున్నారు.
    2.కురుమ లేక గొల్లల స్ధితిగతులు గురించి..

    దక్షిణభారత పశుపాలక కులమైన గొల్లలు మహాభారతం ప్రభావం వలన యాదవులమని చెప్పుకొంటున్నారు.వింద్యపర్వత దక్షిన భాగంలో యాదవులు కాకపోయినప్పటికి(మీ మాట ప్రకారం) యాదవులు అని చెప్పుకుంటున్నది పశుపాలక కులమైన గొల్లలే కాని మరే ఇతర కులము కాదు కదా! పశుపాలక గొల్లలు కాని మరొ ఇతర వ్రుత్తి కులము చేప్పుకున్నట్లుగా సాహిత్య,శాసన,జనశ్రుతి ఆధారాలు లేవు కదా!ఆ ప్రకారం దక్షిన భారత దేశంలో యాదవులు లేక యదువంశం అని చెప్పుకొంటున్నది గొల్లలు కాబట్టి, రాయలవారు కూడా నేను యాదవ కులానికి సూర్యుడవంటి వాడినని క్రీ.శ.1514 మార్చి 15 నాటి మైసూరు జిల్లాలోని తలక్కాడ్ శాసనంలొ స్వయంగా చెప్పుకున్నారు.కావున ఆయన గొల్లే అవుతాడు కదా!

    ReplyDelete
  45. యాదవులను దేశంలొ వివిద ప్రాంతాలలో వివిద పేరులతొ పిలుస్తారు అని నేను చెప్పి ఉన్నాను.దేశంలోని అనేక పోరాట జాతులు లేక కులాలను అద్యాయనం చేసి వ్రాసినటువంటి Martial races of undivided India గ్రంధంలో యాదవ,గొల్ల లేక కురుమ కులాన్ని గురించి ఇలా చెప్పి ఉన్నది.

    Kurubas are known by different names in different areas of the nation.In some locations in karnataka,people from the Kuruba community use Naiker as surname.It means the same as Gowda(a leader of village or temple).The following areused:
    Andar,Ahiyaru,Ahir,Appugolu,Maldhari/Bharwad/Rabari,Bharavadaru,Dhangaru,Dhangad/Dhanka/Dhangod,Doddi Gowda,Gadaria,Gowda,Gaddi,Gadri,Gollavadu,Gounder,Halumatha,Heggades,Idyar,Khuruk,Kuda,Kuruba,Kuruba Gowda,Kurama,Kurumba,Kurar,Kurumbar,Kalavar,Kuruma,Kurumavaaru,Kurkhi,Kurupu,Naikers,Nikhers,Oraon,Pal/pala,Palaru,Paalakyatriya,Poduvar,Yadavalu.

    ReplyDelete
  46. కాటమరాజు కధలు.పేజి cxxx "యాదవులకు గోగణమే ప్రధానసంపద.యాదవ చక్రవర్తి యొక్క గోసంపదను గూర్చి ప్రత్యేకముగా చెప్ప పనిలేదు."

    పేజి.cxxxix "
    'కాటమరాజు యదుకులమునకు చెందిన చంద్రవంశ క్షత్రియుడు; ఆత్రేయ గోత్రజుడు".
    పేజి.ccxxlvi 'గొల్ల శబ్దము వ్రుత్తి వాచకమనియు,యాదవ శబ్దము కుల వాచమనియు రాజవంశ ప్రదీపికలో నిరూపింపబడినది.యాదవులు చద్రవంశ క్షత్రియులనుటలో సందేహములేదు.కాని వీరికి గొల్లవారు అనుపేరుకూడ చాల కాలము నుండి వ్యాప్తియందున్నది."

    " "గోవులను పాలించువారు 'గోపాలురూ.ఈ 'గొపాలాశబ్దమే 'గొల్లగా'మారియుండును:గోపాల>గో ఆల.గోల>గొల్ల,
    లేదా వీరికి గొఱ్ఱేలుమున్నగు జంతువులుండుటచే 'గొఱ్ఱేలవారూఅని పిలువబడి,అదే కాలక్రమమున గొర్లవారు>గొల్లవారుగా మారియుండును. గోపాల శబ్దమునుండి పుట్టినదనుటయే ఎక్కువ సమంజసము.ఏలన తెలుగు భారత భాగవత కాలములనుండియు ఈ గొల్ల శబ్దము కనబడుచున్నది.యాదవులకు పూర్వకాలమున గోగణమే ప్రధానముగా నుండెడిది.ఆధునిక కాలమున వీరికి గోగణము లేదు.గొఱ్ఱెలు మేకలు నున్నవి.ఏది వ్యుత్పత్తిక్రమైనను,యాదవులకు గొల్లశబ్దము వ్రుత్తి వాచకమనుటలో సందేహము లేదు".

    'గొల్లాశబ్దము అచ్చమైన తెలుగు శబ్దమనియు,'యాదవాశబ్దము దానికి

    సంస్క్రుతీకరణమనియు నాయభిప్రాయము".

    యాదవులు,గొల్లలు ఒక్కట్టే అనే నా వాదనకు సాక్ష్యము.

    ReplyDelete
  47. ఓబుల్ రెడ్డి గారూ చెన్నుబోయిన వెంకటేశ్వర్లు గారు టీచర్ గా పని చేస్తున్నారు. ఆయన సెల్. 94918 93474 బి ఎస్ ఎన్ ఎల్ నెంబరు. సిం హం గుహ లోనుండి బయటకు వచ్చింది కాబట్టి. మిగతా విషయాలతో మనకవసరం లేదనుకుంటా...

    ReplyDelete
  48. వెంకటేశ్వర్లు గారూ మీరు చరిత్ర చాలా తెలుసుకోవాలి.

    1.రాయల తల్లి మత్రమే బలిజ కులస్తురాలు అని మీకెవరు చెప్పారు.
    2.అచ్యుతరాయలు బలిజ కులస్తురాలైన తిరుమలాంబను కాక మరెవరిని చేసుకుంటాడు???
    3.రాయల కు బలిజలతొ బంధుత్వాలు వుండక మరెవరితో వుంటాయి?
    4.రాయలు యాదవుడను అని ఎక్కడ చెప్పారో ఖచ్చితంగా చెప్పగలరా???

    ఈ నాలుగవ పాయింటు లో క్లారిటీ లెదు. కనుకనే నేను ప్రశ్నించాను.

    ఈ రోజు నుండి మీకు నేను ఒక ప్రతిపాదన చేస్తున్నాను. మీరు నాకు రెండు ప్రశ్నలు వేయండి నేను వాటికి సమాధానం చెబుతాను. ఆ సమాధానాల తరువాత నేను మీకు రెండు ప్రశ్నలు వేస్తాను దానికి మీరు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వాలి. మధ్యవర్తిగా ఈ బ్లాగ్ నిర్వాహకులు తవ్వా ఓబుల్ రెడ్డి గారిని వుండవలసిందిగా కోరుతున్నాను. దీనికి మీరే కాదు ఓబుల రెడ్డిగారు కూడా ఒకే అంటేనే చర్చిద్దాం.

    ReplyDelete
  49. నాకు ఏ కులం పట్ల అభిమానం కానీ వ్యతిరేకత కానీ లేదన్నారు సంతోషం.

    నాకు మాత్రం ఇతర కులాలపైన ద్వేషం లేదు కానీ, నా కులం అంటే అభిమానం లేదని ఆత్మవంచన చేసుకోను. నాకు నా కులం పై అభిమానం వుంది కనుకనే ఈ వాదనకు దిగాను. ఈ వాదనకు దిగినప్పుడే నా కుల ప్రతినిధి గా నేను, మీ కుల ప్రతినిధి గా మీరు వాదోప వాదాలు చేస్తున్నాము.

    బలిజ కులం ప్రాచినమైనదా, గొల్ల కులం ప్రాచీనమైనదా అనే వాదన మనం చేయడం లేదు. అది మరో చర్చలోనికి దారి తీస్తుంది.

    వికిపీడియా నిర్వాహకులు ఓక సైడు వాదనా సమాచారాన్ని వుంచారు అన్నారు దాని క్రింద వనరుల విభాగం లో జన్యు పరీక్షల వివరాలు ఇచ్చారు మీరు గమనించలేదా?
    వారి సమాచారం మీకు నచ్చకపోతే ఎడిట్ చేసేస్తారా?

    ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలకు వేరే ఏం పనులు లేవా? మీకు నాకు వేరే ఏం పనులు లేవు కాబట్టి తీరికగా వాదులాడుకుంటున్నాము.

    వెనకట ఎవడో అన్నడంట నాకు తేలు కుట్టింది ఊరందరినీ నిద్ర లేపండని..... వీడికి నిద్ర లేదు కాబట్టి ఇంకెవడూ నిద్రపోకూడదు...

    "రాయలవారు కూడా నేను యాదవ కులానికి సూర్యుడవంటి వాడినని క్రీ.శ.1514 మార్చి 15 నాటి మైసూరు జిల్లాలోని తలక్కాడ్ శాసనంలొ స్వయంగా చెప్పుకున్నారు.కావున ఆయన గొల్లే అవుతాడు కదా"!
    ఇది పూర్తిగా తప్పు ఆ శాసనం వివరాలు, దాని సమాచారం పూర్తిగా చెప్పండి. నాకు తెలిసి ఈ శాసనం రాయలు వేయించింది కాదు ఆయన పేరుతో తిమ్మరుసు వేయించింది అంతారు అందులో కూడా రాయలు గొల్ల అని చెప్పుకోలేదు.

    కాటమరాజు గొల్ల అందులో మాకెటువంటి ఆక్షేపణలు లేవు.

    నేను వాస్తవాలు చెబుతున్నానని నమ్ముతున్నాను అన్నారు. వాస్తవాలు అని మీరు అనుకోవడం కాదు నిరూపించాలి?

    ReplyDelete
  50. నేను మొదటి నుండీ చెబుతున్నాను గొల్లలు,యాదవులు ఒకటి కాదని

    మీరు భ్రమ లో వున్నారు మొదట దాని నుండి బయటకు రండి. అన్ని వాస్తవాలూ కళ్ళకు కట్టినట్లు కనబడతాయి.

    మీరు ఎవరితోనో చెసిన వాదనలు నేను చేసినవిగా భ్రమిస్తున్నారు? ముందు మన చర్చలో మనం చర్చించే విషయాల గురించి మాత్రమే చర్చిద్దాం.



    1.కాటమరాజు చంద్రవంశ క్షత్రియుడని ఎవడు చెప్పాడు మీకు.

    ఇది పూర్తిగా జానపదుల గాథ. ఈ కథను కొమ్మ్ములవాండ్లు,సుద్దుల గొల్లలు, మందెచ్చుల వాండ్లు మాత్రమే మౌఖికంగా చెప్పే కథ. ఈ కథ ను కేవలం గొల్లవాడలలోనే చెప్పి వారి నుంది మేక,గొర్రె పిల్ల్లను పుచ్చుకుంటారు.

    పై జానపదులు కేవలం గొల్లవాళ్ళ వద్ద మత్రమే అడుక్కుంటారు.

    తమ జీవనాధారమైన వారిని పొగడడం తప్పులేదు.

    ఈ కథను ఆత్రేయ గారు నాటకం గా రచించారు.

    దీని గురించి చర్చ అప్రస్తుతం దీనిలో భ్రమ కాటమరాజు చంద్రవంశ క్షత్రియుడని అనేధి. ఇది కేవలం మీ భ్రమ మాత్రమే.

    2. గొల్ల శబ్దము అచ్చమైన తెలుగు శబ్దము నిజమే దీనికి సంస్కృతీకరణము యాదవ శబ్దమా? ఇది మీ అభిప్రాయమా?

    అబ్బా ఎంత గొప్ప అభిప్రాయలడి తమరివి.......

    యాదవ శబ్దం కుల సూచకం కాదు. అది వంశ శూచకం. యదువు వంశస్తులను యాదవులు అంటారు. వీరికి కురు వంశస్తులు బంధు వర్గం ఈ విషయం మహాభారతం చాలా స్ప్ష్తంగా చెబుతోంది.

    కనీసం గ్రంథ పఠనం కూడా చేయకుండా ఎందుకొస్తారండీ చర్చలకు.


    అంటే మీ వాదన ప్రకారం పాండవులు, కౌరవులు కూడా గొల్లలే కదా !!!!!

    ఇంకేముంది గొల్ల భారతం అని ఇప్పటిదాకా కాటమరాజు కథ మాత్రమే చెప్పుకుంటారు, ఇక 18 పర్వాల మహాభారతానికి ముందు గొల్ల అని తగిలించుకోండి మహాభారతమే గొల్ల మహాభారతమౌతుంది.


    ఏంటీ దక్షిణ భారతదేశం లో గొల్లలు తప్ప మరో కులం పశువులు కాయడం లేదా.... అబ్బో చివరికి ఈ ఘనత కూడా మీదే అహా...

    ఆంధ్ర,ఒరిస్సా,తమిళనాడు,కర్ణాటక లలో ఆవులు కాసుకునే సుగాలీలు లేద లంబాడీలు ఎక్కడికి పొటారూ...

    ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ను గమనిస్తే మీరు గొర్లను మాత్రమే కాసుకుంటారు. లంబడీలు మత్రమె ఆవులను కాసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ లో ఆవులను కాసే గొల్లలు ఏ ప్రాంతం లో వున్నరో కాస్త చెబితే విని తరిస్తా.....

    ReplyDelete
  51. 1.నేను వికిపిడియ సమాచార్న్ని ఎడిట్ చెసాను అన్నారు.నేను చేయలేదు.నాకు అవసరం లేదు.ఆ నైపుణ్యం కూడ నాకు లేదు.
    2.రాయల కులం గురించి చర్చలొ,యాదవులు వేరు,గొల్లలువేరు అని వాదించినారు.
    3.ప్రభుత్వాల బద్యత ఉన్నది.చరిత్ర పరిరక్షించవలసిన భాద్యత ప్రభుత్వాలదే.
    తలక్కాడు శానం నుannual report of arheology department of mysore.1930. లో చూడవచ్చు.
    4.ఇలాంటి చర్చలకు మద్యవర్తులు ఉండరనుకుంటాను. ఋజువులు,విశ్లేషణలే ఉమటాయనుకుటా!
    5.నేను కాటమరాజు గురించి చర్చ చేయలేదు.ఆ గ్రంధం నుండి వివరాలను ఆధారంగా చూపినాను.

    6.నన్ను ప్రశ్నలను వేయమని అడిగినారు.ఇది చర్చా విదానం కాదు.ఆదారాలను చూపడం,వాటిని విశ్లేషణ చేయడం, పద్దతి.

    7.ఈ చర్చ రాయలు బలిజ లేక యాదవ అనే దాని మీదే చర్చ దానికి పరిమితం చేయండి.

    8.ఈ చర్చ సందర్బంగా నేను బలిజల నుండి వస్తూన్న నాలుగు వాదనలను ప్రస్తావించాను.వాటిని మీరు బలపర్చారు.కావున వాటికి చెందిన ఋజువులు చూపడం ద్వారా చర్చను కొనసాగించండి.ఇది ప్రదాన చర్చే.
    9.చర్చను దూషణల స్తాయికి తగ్గించకండి.

    10.కాటమరాజు గ్రంధంలొనుండి నేను ఇచ్చిన వివరాలు నా అభిప్రాయం కాదు.అది ఆ బుక్ వ్రాసిన తంగిరాల వేంకటసుబ్బారావుగారి అబిప్రాయం.నావాదనకు సాక్ష్యంగా చూపినాను.

    ReplyDelete
  52. Sorry by mistake my postings were published under NUGIEthey are not any related to NUGIE..

    ReplyDelete
  53. I request this bog manager,Thavvaa Obul Reddy if possible delete my postings published under NGUGIE.They are not any way related to NGUGIE.

    ReplyDelete
  54. వెంకటేశ్వర్లు గారూ..! మీ అభ్యర్థన మేరకు కొన్ని టపాలను తొలగించడమైనది.

    ReplyDelete
  55. వెంకటేశ్వర్లు గారూ రాయలు తల్లి మత్రమే బలిజ కులస్తురాలు తండ్రి గొల్ల కులానికి చెందిన వాడని మీ గొల్లలు చెప్పుకుంటున్నారే కానీ బలిజ కులస్తులు కాదు.

    మేము ఎక్కడ కూడా ఇలాంటి చెత్త వాదనలు చేయడం లేదు. తండ్రి నరస నాయకుడు బలిజ వంశస్తుడు. వీరు కర్నాటక లోని తుళు ప్రాంతం లో నివశించారు కాబట్టి తుళువ నరస నాయకుడు అన్నారు. మీరు ముందుగా సందిగ్దం లోనుండి బయట పడండి.

    బలిజ కులస్తులలో కోటబలిజలు, పేటబలిజలు అని రెండు విభాగాలు వున్నాయి. కోటబలిజలు ద్విజులు అంటే కేవలం రాచరికం చేయువారు మాత్రమే జంధ్యం ధరిస్తారు.

    ఇక్కడ ముందుగా మీరు తెలుసుకోవల్సిన అంశం ఒకటుంది. భారతదేశం లో చాలా మంది కులం, వర్ణం ఒకటే అనుకుంటారు. అది తప్పు కులం వేరు వర్ణం వేరు.

    జన్మనా జాయతే శూద్ర:
    కర్మణా జాయతే ద్విజ:
    వేద పఠనంతు విప్రానాం
    బ్రహ్మజ్ఞానంతు బ్రహ్మణే

    జన్మించుటద్వారా అందరూ శూద్రులుగానే జన్మిస్తారు. కర్మలు చేయుట ద్వారా ద్విజులగుచున్నారు. వేదాలు పఠించినవారు విప్రులనబడతారు బ్రహ్మజ్ఞానం సంపాదించినవారు బ్రహ్మణులని పిలవబడతారు.

    ద్విజులు తమ తమ కర్మానుష్ఠానం చెయడానికుద్యుక్తులు కావడమే ఉపనయనం.

    ఇది మీకు కేవలం అవగాహన కొరకు మాత్రమే చెబుతున్నాను.

    ఒకప్పుడు కేవలం మూడు వర్ణాలు మాత్రమే వుండేవి అవి బ్రహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలు ఈ మూడు వర్ణాలు ద్విజులే అంటె ఉపనయనం ద్వారా కర్మలు చేయడానికి మనసా, వాచా, కర్మణా సిద్దమైనటువంటివారు. వీరిలో వ్యవసాయము, వ్యాపారము వైశ్య వర్ణమే చేస్తుండేది. వైశ్యవర్ణ కర్మలను నిర్వహించే వారిలో వ్యవసాయము చేసే వారికి సమయానికి అనుష్టానాలు చేయడం సాధ్యమయ్యేది కాదు అందువల్ల వారికి ఉపనయనం నుండి మినహాయింపు నిచ్చారు. వారే సూద్ర వర్ణం. శూద్ర వర్ణం లో ఎన్నో కులాలున్నట్లుగానే పై వర్ణాలలో సైతం కులాలున్నాయి. ఉదాహరణకు నంబి బ్రహ్మణులు, తంబలి బ్రాహ్మణులు వీరిద్దరూ బ్రహ్మణులే కానీ వారి కులాలు వేరు. వీరిద్దరి వృత్తి దేవాలయాలలో పూజాదికాలు నిర్వహించడమే మొదటివారు వైష్నవ పూజారులు, రెండవ వారు శైవ పూజారులు. అదె విధం గా క్షత్రియులు క్షాత్రమున్న వారందరూ క్షత్రియులే. వీరిలో వివిధ కులాలు వుండవచ్చు.

    ఇది కులాలకు, వర్ణాలకు వున్న తేడా. ఈ సంగతి తెలియక చాలామంది వర్ణాన్ని కులంగా చెబుతుంటారు.

    ఈ విషయం అప్రస్తుతమైనా మీకు అవగాహన కొరకు చెబుతున్నాను.

    ఈ విషయం మీకు అర్థం అయితే కోటబలిజలకు, పేటబలిజలకు తేడా అర్థమవుతుంది.

    ఇక రాయల విషయానికి వస్తే ఆయన రాసిన ఆముక్తమాల్యద ను ఒక సారి పరిశీలిద్దాం.

    యమునాచార్యుడు రంగనాథ స్వామి పాదాలు చూసిన తరువాత పూర్వజ్ఞానం కలుగుతుంది. అప్పుడు తన కుమారుడికి రాజ్యాన్ని అప్పగించి రాజ నీతి గురించి చెబుతాడు.

    ఇక్కడ రాజనీతి గురించి చెబుతున్నది యమునాచార్యుడనే పాత్ర అయినా ఆ రాజనీతి రాయల వారి స్వంత రాజనీతి అన్న విషయం గుర్తుంచుకోవాలి.

    భిల్లులు, మొదలైన ఆటవిక జాతుల వారు రాక్షస నీతి అవలంబిస్తారు. రాజు ఆజ్ఞకు అటువంటివారు వణుకుతూ బద్ధులై వుండేటట్లు చూడాలి.

    అంటే ఆటవిక జాతులైన బొయ, ఎరుకల వంటి జాతుల కు రాయల కులానికి ఎలాంటి సంబంధం లేదని రుజువవుతుంది. ఎందుకంటే ఏ రచయిత కూడా తన జాతిని తప్పుగా చెప్పుకోడు.


    కోట కాపలా, రక్షణ భారాలను ఆప్త బంధువులకే అప్పగించాలి. ఎవరిని బడితే వారిని నమ్మి ఇలాంటి బాధ్యతలు అప్పగిస్తే వారు కోటకే ప్రమాదం తీసుకు వచ్చి రాజ్యవిచ్చిత్తికి కారణం కాగలరు. అంటే రాయల వారి కాలం లో తమ కులం వారికి పెద్దపీట లభించిదనేది వాస్తవమే కదా.


    ReplyDelete
  56. మరొక చోట అల్పబుద్ధి గరవారిని, హీనకులస్తులను దూరం చేసుకుంటే వారు తొందరగా అలుగుతారు కనుక వారిని పరాయి వారికి భారం కాకుండా తృప్తిపరుస్తూ వుందు.

    భార్యల పతిభక్తి, స్త్రీ పురుషులు వావి వరుసలు పాటించడం, దిగువ జాతులు అగ్రజాతులను అనుసరించుట, అధికారి పనికి సేవకులు ఒప్పుకొనుట ఇవన్నీ రాజు దండిస్తాడనే భయం తోనే సుమా!

    అంటాడు రాయల వారు. చివరి రెండు పేరాలను గమనిస్తే రాయలు అగ్రకులానికి చెందిన వాడనే అర్థం అవుతోంది కదా.

    మరి ఆంధ్ర దేశ చరిత్రలో ఎప్పుడైనా ఏ కాలం లోనైనా గొల్లలు అగ్ర కులస్తులుగా చలామణి అయ్యారా???


    గొల్ల ప్రభువుగా చెప్పబడుతున్న కాటమరాజు సైతం గొప్ప పశు సంపద కలిగిన సంపన్న గొల్లడే కానీ రాజు కానీ చక్రవర్తి కానీ కాదు.

    ఈ కథలోనే తెలుస్తుంది శ్రీశైలం అడవులలో ఆవులను మేపుకుంటుండగా గడ్ది దొరకక నెల్లూరు మండలాన్నేలుతున్న నల్లసిద్ది మహారాజును ఆవులు మేపుకుంటానని అనుమతి కోరుతాడు. తరువాత మాటతప్పి యుద్ధానికి దిగుతాడు. ఈ యుద్ధం లో సైతం ఎక్కడ కూడా ఏనుగులు వాదినట్లు చెప్పరు ఏనుగుల లాంటి ఎద్దుల గురించే చెబుతారు.

    దీన్ని బట్టి ఏమర్థమౌతోంది గొల్లలు ఏ రోజు కూడా రాజ్యాలు ఏలలేదు అన్నది సుస్పస్టం.

    ఎప్పుడూ కాటమరాజు పౌరుషాన్ని కథలుగా చెప్పే సుద్దుల గొల్లలు మరి మహా చక్రవర్తి అయిన రాయల వారి కథను ఎందుకు చెప్పలేదో......

    ఎందుకంటె కాటమ రాజు గొల్లప్రభువు కాబట్టి ఆయన కథలు చెప్పారు,

    రాయల వారు గొల్ల కులస్తుడు కాదు కాబట్టి ఆయన కథలు వారు చెప్పలేదు.

    ReplyDelete
  57. ఇక రాయల వారి తండ్రి సంపెట నరస నాయకుడు. ఈయన విజయనగర చక్రవర్తి సాళువ నరసిం హ దేవరాయల వద్ద సర్వ సేనాధిపతిగా వుండేవాడు. వీరు ఇద్దరూ వియ్యపు కుటుంబాలకు చెందిన వారు. ఈదే సాళువ వంశానికి చెందిన తిమ్మరాజు (కన్నడం లో అరుసు అంటే రాజు అని అర్థం) మంత్రిగా వుండేవాడు. నరస నాయకుని పెద్ద భార్య తిప్పాదేవి లేదా తిప్పాంబ. సాళువ నరసిం హ రాయలుకు సోదరి. ఈమె కుమారుడే వీర నరసిం హ రాయలు.

    సాళువ నరసిం హదేవరాయల తదనంతరం ఆయన కుమారుడు రెండవ నరసిం హరాయలు పిల్లవాడు కావడం తో ఆయనను సిం హాసనం పై కూర్చోబెట్టి నరసనాయకుడు రాజ్యపాలన చేశాడు. నరసనాయకుని అనంతరం ఆయన పెద్దకుమారుడు వీరనరసిం హరాయలు రెండవ నరసిం హరాయలుకు ప్రతినిధిగా వుండి రాజ్య పాలన సాగించాల్సి వుండగా అతడిని చంపి రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. ఇతని కౄరత్వానికి ప్రజలంతా అసహ్యించుకున్నారు. కానీ బలవంతుడు కావడం తో ఎవరూ నోరు మెదపలేదు తిమ్మరుసు తో సహా. కేవలం ఆరు సంవత్సరాలు మాత్రమే ఈయన రాజ్యం చేశాడు. అనారోగ్యం తొ చనిపొయిన తరువాత ఆయన సవతి సొదరుడు శ్రీకృష్ణదేవరాయలును తిమ్మరుసు చక్రవర్తిని చేశాడు.

    నరస నాయకునికి ముగ్గురు భార్యలు ఒకరు తిప్పాంబ సాళువ నరసిం హ దేవరాయలకు సోదరి వరుస అవుతుంది. రెండవ భార్య నాగంబ నరసిమ్హదేవరాయల సోదరుదు తిమ్మరాజు బంధువులు అరిగండాపురం గాజుల వారి ఆడపదుచు, ఇక మూడవ భార్య ఓబులాంబ.


    రెండవ భార్య నాగాంబ ఎకైక కుమారుడే మన హీరో కృష్ణరాయలు.

    ఈమెనే పెమ్మసాని వారి ఆడపడుచు అని కమ్మ వారు పొరపాటు పడుతుంటారు. ఎందుకంటే గండికోట లో వున్న పెమ్మసాని కుమార్తె పేరు కూడా నాగమ్మే కావడం ఈ పొరపాటుకు కారణం. గండికోట నాగమ్మను దీపాల నాగి అంటారు.

    ReplyDelete
  58. నాగాంబను ఉదయగిరి ప్రాంతానికి వచ్చినప్పుడు నరసనాయకుడు మోహీంచి పెద్దలను ఒప్పించి పెళ్ళి చేసుకున్నాడు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే విజయనగర రాజులందరూ తెలుగు వారేనన్న సంగతి. నాగాంబ సొంత ఊరు నాగులాపురం, ఈ గ్రామం పేరు అరిగండాపురం. రాయలు ఈక్కడే జన్మించారు. తాను పుట్టిన ఊరు కొరకు వేదనారాయణ స్వామి దేవాలయాన్ని ఇక్కడ నిర్మించాడు. నేటికీ ఈ దేవాలయాన్ని నిర్వహించేది రాయల వారి బంధువులే.

    బలిజ కులం లో ఇంటర్ క్యాస్ట్ మేరెజెస్ లేవు. ఒక వేళ అల చేసుకున్నా వారిని కులం లోనుండి వెలివేస్తారు.

    రాయల వారి విషయం లో కూడా అలాగే జరగాల్సివుండేది. చిన్నమదేవి నర్తకి కావడం తో ఆమెను ఎంత ఇష్టపడి పెళ్ళి చేసుకున్నా ఆమె పట్టపురాణి కాలేక పోయింది.

    మొదటి భార్య కావాల్సిన చిన్నమదేవి రెండవ భార్య కావాల్సి వచ్చింది.

    తన ప్రేమ విషయం చెప్పగానే వారిని వివాహం చేసుకోకూడదు అని తిమ్మరుసు వారించాడు. ప్రభువు ఎప్పుడు కూడా కులకాంతలనే మొదట పెళ్ళి చేసుకోవాలని మైసూరు గంగరాజుల ఆడపడుచు తిరుమలదేవినిచ్చి వివాహం జరిపించాడు. ఆ తరువాత రాయసం కొండమరుసు చిన్నమ దెవిని దత్తు తీసుకుని కన్యాదానం చేశాడు. ఆ తరువాత తుక్కాదేవితొ సహా 12 మందిని రాయలు వివాహం చేసుకున్నారు. అందువల్లనే తిరుమలదేవి కుమార్తెలను పెళ్ళి చేసుకున్న ఆరవీటి వంశస్తులు రామరాయలు, తిరుమలదెవరాలులకే రాజ్యం దక్కింది. మిగిలిన రాణులకు పిల్లలున్నప్పటికీ వారికి రాజ్యార్హత దక్కలేదు. కనుక కులకాంతలనే రాజమాతలు గా అంగీకరించేవారు.


    దీన్నిబట్టి రాయల తల్లిదండ్రుల కులాలు వేరు వేరు కాదన్నది స్పష్టమౌతొంది.

    ReplyDelete
  59. http://te.wikipedia.org/wiki/%E0%B0%A8%E0%B0%BE%E0%B0%97%E0%B0%B2%E0%B0%BE%E0%B0%AA%E0%B1%81%E0%B0%B0%E0%B0%82


    naagulaapuram, chittore dist.

    ReplyDelete
  60. మీరు చాల వివరణ ఇచినారు.ఖాని అవన్ని out of context

    ఆనాటీ శాసన,సాహిత్య ఆధారలు మాత్రమే ప్రామాణికం.వాటి మీద ఎదైన వివరణ అవసరమైతె చెయవచ్చు కాని ఏవో జనరలగా చెప్పెవి కాదు.

    ReplyDelete
  61. తవ్వా ఓబులరెడ్డి గారూ ఒక వాదన జరుగుతున్నపుడు వాదన చేసేవారు తమ మెరిట్స్ ను చూపుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వాదనలో పై చేయి కావడానికి అవి చాలా అవసరం కూడా. ఆ వాదనలను అవతలి వ్యక్తి సమర్థవంతంగా తిప్పి కొట్టగలగాలి. అలా చేయలేనప్పుడు ఓటమిని అంగీకరించాలి. వాదన ఒక వైపు నుండి ఆగిపొయినప్పుడు మరోవైపు వ్యక్తి సమర్థవంతమైన వాదనతో ముగింపు పలుకుతాడు.
    అలా నేను స్వస్తి వాచకాలను నా వైపు నుండి పొస్ట్ చేశాను. ఆ పదాలు అవతలి వ్యక్తికి ఇబ్బంది కలిగించి వుండవచ్చు. బ్లాగ్ నిర్వాహకుడిగా ఏ ఒక్క వాదననూ తొలగించకుండా ఇరువైపు వాదనలను మీరు యథాతథంగా అలాగే ఉంచాలి. కానీ మీరు నా చివరి వ్యాఖ్యలను తొలగించారు. అలా తొలగించకుండా వుండాల్సింది. అలా నా వ్యాఖ్యలను తొలగించి మీరు పక్షపాత వైఖరిని అవలంబించినట్లుగా కనబడుతోంది.
    మీ బ్లాగు మీ ఇష్టం. కాదనడం లేదు. నిజమైన చరిత్ర బయటపడాలంతే ప్రసవ వేదన తప్పనిసరి ఆ వేదన లో భయంకరమైన బాధను తల్లి అనుభవిస్తుంది. ఆ తరువాత ఆ తల్లి ఆనందాన్ని ఏ రచయితా వర్ణించలేడు.

    ReplyDelete
    Replies
    1. అభిమన్యు గారు..! సాంకెతిక కారణాల వల్ల మీ వ్యాఖ్య తో పాటు మీ వ్యాఖ్యకు ముందున్న మీ ప్రతివాది వ్యాఖ్య కూడా తొలగి పోయాయి. అంతే కాని నాకు ఎవరి పట్ల పక్షపాతం లేదు. అలా ఉండటం వల్ల నాకు ఒనగూరే ప్రయోజనమూ లేదు. మీ ముందు వ్యాఖ్యను ఉటంకిస్తూ మీ వ్యాఖ్యను మళ్ళీ మీరు చేయవచ్చు.

      Delete
    2. This comment has been removed by a blog administrator.

      Delete
    3. This comment has been removed by a blog administrator.

      Delete
  62. తవ్వా ఓబుల్ రెడ్డి గారూ...
    గొల్ల వికీపీడియాను చూడండి. మే 10 2013 నాటికి వికిపీడియాలో వున్న సమాచారాన్ని యథాతథంగా మీ బ్లాగ్ లో పేస్ట్ చేశాను. దాన్ని మొత్తం ఎడిట్ చేశారు. ఒక్కసారి గమనించండి తమ చరిత్రను ఇతరులకు కనబడకుండా ఎంత జాగ్రత్త పడుతున్నరో ... ఇలాంటి వారి చేతికి శాసనాలు దొరికితే వాటిని కూడా ధ్వంసం చేస్తారేమో. మేము వికిపేడియాను ఎడిట్ చేయలేదు అనేవారు ఇది ఎవరు చేశారో చెప్పగలరా...

    ReplyDelete
    Replies
    1. అభిగారు,నేను మీ వికిపిడియ సామాచారాన్ని మార్చలేదు.నాకు అవసరం లేదు.ఇక శాసనాలను మార్చవలసిన అవసరము లేదు.
      ఎల మొదలయినదొకాని మీ వారు ఇటువంటి వాదనలు చేస్తున్నారు.మీరు చేస్తున్న సుదీర్గ వివరణలు మీ వాదనను ఏమాత్రం బలపరిచేవి కావు.నా ఈ ప్రయత్నం చరిత్రకారులు నిర్దారించిన వాస్తవన్ని తెలియచెప్పలనే కాని అన్యదా కాదు.

      కాటామరాజు కాకతియుల సామంతుడిగ కనిగిరిసీమను పాలించినాడు. ఇది కూడా చరిత్రకారులు తెలిపినదే.

      నేను ఈ చర్చలొకి వచ్చినది పై చేయి సాదించాలని కాదు.చారిత్రకవాస్తవాన్ని తేలియచేయలని మాత్రమే.

      నా వివరనలు సరైనవి కాదనిపిస్తే శాసన,సమకాలిన సాహిత్య ఆధారలతో వివరణ ఇవ్వవచ్చు.

      వారి వారి కూలాలకు గొప్ప చరిత్ర ఉండలనుకోవడంలొ తప్పు లేదు. అందుకు చారిత్రక వాస్తవాలను తప్పుగా అన్వయిచకుడదు అనేదె నా ఈ ప్రయత్నము.

      భారతీయ సమాజం ఎంతో దూరము సాగిపోయినది.ఈనాడు కూలాల నిర్దారణకు DNAలు blood groupలు లాంటివి సాధనాలు కావు.

      Delete
  63. పెద్దలు వెంకటేశ్వర్లు మరియు అభి గారికి, నేను కొన్ని విషయాలను తెలియ చేయాలనుకుంటున్నా .ముందుగా మొదటి కామెంట్ నుంచి ప్రారంభిస్తే .
    1.వందన దాస్ గారు ..మీరు మీ స్నేహితిడుకి చెప్పవలసిన సమాధానం : మీరు మేము వేరైతే...అప్పటి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మరియు బీహార్ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ గారు బాపట్ల ప్రాంతం లో నిర్వహించిన అఖిల భారత యాదవ మహాసభలకు ఎలా హాజరు అయ్యారు అని అడగండి.ఈ మధ్య అఖిలేష్ మొన్న జరిగిన హైదరాబాద్ అఖిల భారత యాదవ మహాసభకు ఎలా హాజరు అయ్యారు అని అడగండి.

    దీనితో మీ సందేహం : " మీరు ఉత్తర భారతదేశ యాదవులు ఒక్కటే అని నిరూపించండి" -- తీరిందను కుంటున్నాను.

    2.నేను బాపట్ల ప్రాంతానికి చెందిన వాడిని కనుక ఇక్కడ ప్రజల జీవన విధానం తెలియ పరచాలనుకుంటున్నా ---అభి గారు అడిగినట్టు నా సర్టిఫికేట్ మీద మరియు ఇక్కడ అందరి సర్టిఫికెట్స్ మీద , పేరు పక్కన కూడా యాదవ్ అని ఉన్నాయి.కావాలంటే ప్రతి ని పంపించగలను .ఇక్కడ వ్యవసాయం , పశు పోషణ ప్రధాన వృత్తులు.ఇక్కడ మా తాతల నుండి మా పేర్ల ను చూస్తే పేరు చివర "రాజు " కచ్చితంగా ఉండాల్సిందే . ఉదా : గంగరాజు , గోవిందరాజు ,గోపి రాజు , లింగ రాజు,కృష్ణంరాజు ...అలా ఉన్నందుకు ఇక్కడ ఎవరు మేము రాజులము అని చెప్పుకోవటం లేదు.యాదవులమే అది చాలు మాకు.

    3.అభి గారు : May 7, 2013 at 10:14 నాడు రాసిన సమాధానం లో ఈ విధంగా సెలవిచ్చారు --"రాయల కాలం నాటికి వారి కులాలు లేవు." అని.
    ఇంకొక చోట : May 16, 2013 at 12:35 "బలిజ కులం లో ఇంటర్ క్యాస్ట్ మేరెజెస్ లేవు. ఒక వేళ అల చేసుకున్నా వారిని కులం లోనుండి వెలివేస్తారు. రాయల వారి విషయం లో కూడా అలాగే జరగాల్సివుండేది."

    నా అభిప్రాయం వరకు అప్పుడు వంశాలు ఉండేవి...మరి ఈ రెండు నాల్కల సమాధానం ఎలా మేము అర్ధం చేసుకోవాలి...?

    4. ఇక గొల్ల అనే పదం వాడుక గురించి, దీని అసలు పదం గ్వాలా (Gwala)వంశస్తులు.ఇక కాటమరాజు కథ గురించి మా ఇళ్ళలో ఎవరినా పెద్దవారు కాలం చేస్తే 15 రోజున చెప్పిస్తారు.మాకు రాజ గురువులు ఉన్నారు.మరి వీరు ఎక్కడ నుంచి వచ్చి వుంటారు మేము రాజులం కాకపోతే .కాకతీయ రాణి రుద్రమ దేవి తన కూతురిని ఒక యాదవ రాజు పేరు అయ్యన్న దేవుడు కి ఇచ్చి వివాహం చేసింది.అంటే అప్పట్లో యాదవులు ఉన్నారనే గా.గొల్జొండ కోట చరిత్ర తెలుసుకుంటే తెలిసిద్ధి ఎవరు నిర్మించారో(14 మంది యాదవ సామంత రాజులు నిర్మించిందే గొల్లకొండ -->ఇప్పటి గోల్కొండ.) దాని వెనుక ఉన్న వృతాంతం.
    ఇక సాక్షాత్తు కలియుగ దైవం తిరుమలలో ఉన్న గొల్ల మండపం దాని చరిత్ర మీకు తెలిసే ఉంటుంది ...మరి వారు గోవులను పోషించే వారు కాదా , వారు ఆంధ్ర ప్రదేశ్ కాదా....? ఇంకా సామర్ల కోట దగ్గర ఉన్న కుమార స్వామి దేవాలయం , గుంటూరు కోటప్ప కొండ దేవాలయ చరిత్ర చుడండి ...వారంతా గోపాలకులే.
    దీని బట్టి అర్ధం చేసుకో గలరు రెండు ఒక్కటే అని.

    5.మీరు హుందాతనం తో వ్యవహరించాల్సింది. మీరు చెప్పినట్టు సంపెట పేరు , ఇంటి పేర్లు , పుట్టపర్తి గారి ఆధారాలు అనుకుంటే ....మరి వారి గురువులు ..శ్రీకృష్ణదేవరాయల ఆస్థానకవి నంది తిమ్మన, తాను రాసిన 'పారిజాతాపహరణ ము' కావ్యంలో ఎన్నోచోట్ల శ్రీకృష్ణదేవరాయలును యాదవుడుగా పేర్కొన్నాడు. ఆ కావ్య స్వీకర్త కూడా శ్రీకృష్ణ దేవరాయలే. తన ఆస్థానంలోని కవి, తన గురించి, తన వంశావళిని గురించి తప్పుగా రాస్తే ఏ రాజైనా సహించగలడా?
    మీరు చెప్పినట్టు " నా కులం అంటే అభిమానం లేదని ఆత్మవంచన చేసుకోను. నాకు నా కులం పై అభిమానం వుంది కనుకనే ఈ వాదనకు దిగాను." -- మరి శ్రీకృష్ణ దేవరాయలకు లేదంటారా...?

    6. మీరు దమ్ము, 100000 పందెం గురించి మాట్లాడుతున్నారు....మరి మొన్న జరిగిన శ్రీకృష్ణ దేవరాయల 500 ఉత్సవాల తరువాత యాదవులు బహిరంగం గా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పారు .అప్పుడు చూపించాల్సింది మీ దమ్ము....

    7.ఒక్కటి నిజం అభి గారు మీరన్నట్టు పెద్దగా చదువుకోలేదు, వెనుక పడ్డారు అని అది తెలిసి కూడా వికీపీడియా సమాచారం మార్చారు అని మరలా మీరే నిందిస్తే ఎలా...?


    వారే మేము వేరు కాదని అనుకుంటుంటే ...మీరు వేరని చెప్పటం సబబేనా ....? అన్ని వర్గాల్లో ప్రాంతాల వారిగా పిలిచే విధానం ఉంది కదా ...ఉదా : ఆంధ్ర ప్రాంతం లో నాయుడు,కాపు,బలిజ,తెలగ(బాపట్ల లో మా ఊరిలో ఇలా పిలుస్తారు ),తూర్పు కాపు...ఇక తెలంగాణా లో మున్నుర్ కాపు ...వేరని నేను అనుకోవటం లేదు..

    "గొప్ప మనుషులకు కులం,మతం, ప్రాంతం లేదు ..వారు ఈ జాతి సంపద" -- ఈ ముక్క మీ ఇద్దరిలో ఎవరైనా అంటే మూడో వ్యక్తి సంభాషణ ఉండదు.

    ధన్యవాదాలు
    వీరేశ్

    ReplyDelete
  64. యాయాతికి, దేవయాని జన్మించిన వారు -యదువు, తుర్వసుడు. మిగిలిన ముగ్గురు కుమారులు -యాయాతికి, శర్మిష్ఠకు జన్మించినవారు. వీరందరూ యాదవులే

    వెంకటరత్నం యాదవ్ గారికి వంశాల గురించిన అజ్ఞానం చాలా ఎక్కువగా వున్నట్టుంది. నాకు తెలిసి యదువుకు పుట్టిన వారిని యాదవులు అన్నారు.


    యదువు తమ్ముడగు తుర్వసుని వంశ పరంపరలోని వారమని గంగవాడి, కళింగ గంగ వంశీయులు, విజయనగర పాలకులైన శ్రీకృష్ణదేవరాయల కుటుంబీకులు ప్రకటించుకున్నారు. ఇంకా తుర్వసుని వంశ పరంపరలోని వారే దక్షిణాదికి వచ్చి పాండ్య, చోళ, కేరళ, కుళ్య రాజ్యాలను స్తాపించెనని పురాణాల కథనం. మరియు యవనులు అను వారు కూడా తుర్వసుని వంశ పరంపరలోని వారని పురాణాల కథనం.

    యదువు తమ్ముడగు "అను" వంశ పరంపరలోని వారే అంగ, వంగ, కళింగ, పుండ్ర, ఓడ్ర, ఆంధ్ర మొదలగు వారని పురాణాల కథనం.

    యదువు తమ్ముడగు ద్రుహ్యు వంశ పరంపరలోని వారే కంబోజ, మ్లేచ్చులు మొదలగు వారని పురాణాల కథనం.

    యదువు తమ్ముడగు పురు వంశ పరంపరలోని అర్జనుని వంశం వారే భారత ఖండానికీ సర్వచక్రవర్తులు గ కలియుగములో వర్దిల్లినారు. వారి వంశ పరంపరలోని వారమని చాళుక్య, విజయనగర పాలకులైన అరవీటి మొదలగు వంశాలవారు ప్రకటించుకున్నారు).

    కృతయుగములో తరువాత ద్వాపరయుగములో ఆ తరువాత కలియుగములో ఈ యయాతి వంశీయులు అనేక అనేక వంశ అనువంశ పరంపరలుగా విడిపోతూ అనేక వర్గాలుగా విడిపోయి భరతఖండమంతా విస్తరించినారు. వీరందరూ ఉమ్మడిగా చంద్రవంశీయులు.

    కనీసం చరిత్ర చదవకుండా కూడా ఇలాంటి రచనలు చేస్తారా???

    ఎవరికి పుట్టిన వారిని వారి వంశీకులుగా చెబుతుంటారు. వెంకటరత్నం గారికి పుట్టిన పిల్లలు వారి అన్న వంశీకులు అని పిలువ బడతారా...
    కనీస అవగాహన లేకుండా ఎల వాదిస్తారు ఇలాంటివిషయాలను.

    ఆచార్య యార్లగడ్డ బాలగంగాధరరావు గతంలో 'కమ్మ వికాసం'లోను, నేడు 'పల్నాటివీరచరిత్ర'

    ఆచార్య ఎస్ గంగప్ప 'తెలుగు విద్యార్థి' (జూలై 2010)

    పి. శ్రీరామమూర్తి రాసిన 'ఏ హిస్టరీ ఆఫ్ విజయనగర ఎంపైర్'

    ఇవి తప్పులు పొరపాటుగా రాసిన రాతలు అని నిరూపించడానికి మేము సిధ్ధం గా వున్నాము.
    దీనిపై చర్చకు సిధ్ధం. ఎప్పుడైన సరే, ఎక్కడైన సరే. శ్రీ రాయలు ఒక్కడే కాదు యావత్ విజయనగర రాజులు అంతా బలిజ కులస్తులే అన్న ఆధారలతొ మేము సిధ్ధం.

    ReplyDelete
    Replies
    1. నేను నీ వాదలను చూస్తూన్నాను.
      గతములో కూడా నేను నిన్ను హెచ్చరించ్చాను.
      కొన్ని అపరిపక్వమైన రాతలను సాక్ష్యాలని చూపుతూ పిచ్చి వాదన చేస్తున్నావూ.
      మేము నిరూపిస్తామూ, మేము నిరూపిస్తామూ అని అదే పనిగా అనటమే గాని ఇంతవరకు నిరూపించింది లేదు.దబాయించడమే గాని వాళ్ళు చూపించినట్లు నీవు ఏ అధారం చుపిచలేదు.

      నీవు నిరూపించాలనుకుంటున్నది క్రిష్ణరాయలు బలిజ జాతికి చెందిన వాడనా లేక యాదవులు గొల్లలు ఒకటికాదనా?

      పిచ్చి సాక్ష్యాలు, పిచ్చి వాదనలు ఆపి నీ దగ్గర నిజమైన ఆధారాలు ఉంటె చూపించి నీ వాదన నిజమని నిరూపించూ.

      Delete
  65. వీరేష్ గారు చాలా నిదానంగా చక్కగ మీ వాదనను వినిపించారు. నేను చాలా రోజులుగా ఈ బ్లాగుకు రానందు వల్ల మీ కామెంట్ చూడలేక పొయాను.

    మే 7, 2013 సమయం 10:14 నాడు నేను రాసిన వ్యాఖ్య ను అర్థం చేసుకునే స్థాయి మీకు లేదని నేను భావించాల్సి వుంటుంది.

    నాటికి వారి కులాలు లేవు అంటే అప్పటికి వెలమ, కమ్మ కులాలు ఏర్పడక పొయివుండవచ్చు అని నా అభిప్రాయము.

    బలిజ కులం లో ఇంటర్ క్యాస్ట్ మ్యారెజెస్ లేవు అనే విషయం తెలుసుకోవాలంటే నేను పెద్దగా చదువుకోలేదు అనేది సమాధాన కాజాలదు.

    5.వ పాయింట్ లో పారిజాతాపహరణం గురించి మాట్లాడారు మీరు చదివారా? మీకు అర్థం కాక పోతే పండితులను అడిగి అర్థం తెలుసుకోండి?
    ఎవరో ఒక తప్పు చేశారని దాన్నే పట్టుకుని అదే వాస్తవమనుకుంటే అది మీకే నష్టం.

    పారిజాతాపహరణం లోనే తన కులానికి చాలా ప్రాధాన్యతనిచ్చాడని రాశారు నంది తిమ్మన గారు. మరి 15 శతాబ్దం నాటి శాసనాలు, ఫర్మానాలు చూస్తే గొల్లలకు దక్కిన గౌరవం కనిపిస్తుంది.
    ఇవి చాలాచోట్ల లభిస్తాయి.

    నేను స్వాతంత్ర్యానికి పూర్వం ఎక్కడ కూడా యాదవ అనే కులం అంధ్ర ప్రదేశ్ లో లేదని నేను అన్నాను. కానీ మీరు మా సర్టిఫికేట్ లలో యాదవ అని వుంది అంటున్నారు. నేను చుపించమంటున్నాను చూపగలిగేది మాత్రమే సత్యమౌతుంది.

    ఒక వ్యక్తి రాతను అర్థం చేసుకోవాలంటే కనీసం ఆ వ్యక్తి స్థాయి వుండాలి.
    ఒక వ్యక్తిని విమర్శించాలంటే అతడిని మించిన స్థాయి వుండాలి.

    నేను చరిత్రలో గొల్లలకు ప్రాధాన్యత లేదని ఎప్పుడు అనలేదు.

    మీరు కూడ ఒప్పుకున్నారు గోల్కొండను గొల్లకొండ అన్నారే కానీ యాదవ కొండ అనలేదు.

    కృతజ్ఞతలు చెబితే నా దమ్ము చూపించాలా???

    అసలు మీరు ఏం మాత్లాడుతున్నారో మీకైనా అర్థం అవుతోండా???

    నా దమ్ము చూడాలంటే ముందు మీకు చదవడం, తెలుసుకోవడం వాస్తవాన్ని నిజాయితీగా ఒప్పుకోవడం రావాలి.

    ఆ తరువాత ఎదురెదురుగా చర్చకు రావాలి.

    పారిజాతాపహరణం లో ముక్కు తిమ్మన గారు తప్పుగా రాయలేదు. పాపం ఆయననెందుకు 500 సంవత్సరాల తరువాత ఆడిపోసుకోవడం.

    ఆయన రాసిన పద్యాలను అర్థం చేసుకోలేక పోవడం మీ దురదృష్టం.

    చివరలో జాతి సంపద గురించి మీరు మాట్లాడిన మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది.

    శ్రీ రాయల వారి గురించి బలిజ కులస్తులు చెప్పుకోకూడదు అని మీ రాష్ట్ర నాయకులు వ్యాఖ్యానించిన తరువాతనే మేము రంగంలోకి దిగాము మిష్టర్ వీరేష్ గారూ...

    మూడో వ్యక్తినని వ్యాఖ్యానించిన మీరు తటస్థంగా ఉండక గొల్ల కులాన్ని ఎందుకు వెనకేసుకొచ్చారో???? చెప్పగలరా...

    ఇవన్నీ ఎందుకు మా సాక్ష్యాలు ఆధారాలతో మేము వాదనకు సిద్ధం. మీరు ఎవరైనా సిద్ధపడి కబురు చేయండి పండితులు, చరిత్రకారుల సమక్షం లోనే తేల్చుకుందాం.

    వాస్తవాలు తెలుసుకోవాలంటే నోటిమాటలు చాలవు. ఖచ్చితంగా ఆధారాలు కావల్సిందే.

    ReplyDelete
  66. raju kanna monddodu balavanthudu

    ReplyDelete
  67. Raju kantay monddodu balavanthudu

    ReplyDelete
  68. page 179


    No 38.

    Nanjangud Taluk



    1. Svasti sri vijayabhyudaya Salivahana saka 5 varusha

    2.1434 sandu ......srimukha samvatsarada Phalguna ba svasti jitam

    3.bhagavata gata ghana gaganabhena sthira simhasanarudha sri nahaajadhiraja ra

    4.ja parameswara sriman mahamedini ,miseyaraganda kathari saluva sriman dekshina samu

    5.dradhipati Narasimha varma maharajadhiraja tut putra pituranvagata YADAVA kulamba

    6.ra dyumani samyuktva chudamini sakala vanahi brind sandoha (santarpana)paranarisahodara

    7.sauchavira(sarvavira) parakramadhara sakala desadhisvara mani makuta charanaravinda kathari

    8.trinetra srimat krishnavarma maharajadhiraja prudhvirajyam geyinottiralu dakshina de

    9.sadhi vijayavagi dittayisida vira Krishnarayara nyupadim srimanu mahapradhanam Ya

    10.ju sakheya khandava gotrada Apastambha sutrada srimanu Saluva Timmarasaru dakshina

    11.varanesi Gajaranyakshetra Rajaraja purvada Talakadali sri mahadevadevo

    12. ttama kirti Narayana devarige thayurasthalada kavahaliyolaganegado ...............................


    Translation
    -----------

    Be it well.In the victorious and prospering Salivahan era 1434 year s having expired while the year srimukha was current, on the 5th lunar day of the dark half of Phalghuna.

    Be it well.Victory to the Adorable(padmanabha)who resembles the sky free from clouds.

    While illustrious Krishnavarma maharajadhiraja seated on the stable throne, the prosperous king of kings, lord of kings, champion over those who wear mustaches in the great earth, kathari saluva(dagger and kite ) , ruler over the southern sea,Narasimha mahadhiraja's son ; asun to the fragment that is the Yadava race of which he is a lineal descendant: :..............................

    Under the orders of vira Krishnaraya, whole he was pleased to go on a victorious expedition to the to the south:the illustrious mahapradhana(chief minister) Saluva Timmarasa of yaju sakha khandava gotra and apastambha sutra made agift to the best of the gods kirtinarayana devaru of Talakadu which is Rajarajpuram...............

    Note
    -----

    It belongs to the reign of Vijayanara king Krishnaraya and is dated S.1434srimuka sam.phal.ba.5. This data correspond to March 15, A.D. 1514; .........


    The pecular feature in the historical portion of this record the king Krishnaraya is here styled krishnavarma maharajadhiraj as is also the case in two other inscriptions of th same Talu.(E.C.-III Nanjanguda 190 and 195 of 1512 and 1513 A.D)............

    University of Mysore

    Annual Report of the Mysore Archaeological Department for the 1930

    Banglore
    1934.
    నా దగ్గర వున్న శాసనలలొ ఒక్కదానిలొని ముఖ్యమైన, అవసరమైన భాగాలని ఇస్తూన్నాను. ఈ శాసనాలు కర్నాటక రాష్ట్ర పురావస్తు శాఖ వద్ద దొరుకును .

    ప్రత్యుత్తరం

    ReplyDelete
  69. ఓబులరెడ్డి గారూ ంఅయ్ 3, 2013 అత్ 7:21 ఫం న నేను పెట్టిన కామెంట్ లో బాంబే గెజిట్ సమాచారం మార్చబడింది మార్చబడిన భాగాలు గమనించగలరు.

    The Poona Kunbis not content with calling themselves Marathas, go so far as to call themselves Kshatriyas and wear the sacred thread they include a traditional total of Ninety six clams which are side to be sprung from the rules of fifty six contries who are the desandants of Vikram of Ujjaini whose traditional date is B.c 56, Shali Vahana of paitham whose traditional date is A.D.76, and bhojaraaja of malwa whos traditional date is about th end of the 10th centuary A.D.According to the traditional accounts. The Bhonsles to whoom Shivaji belonged are the descendents of Bhojaraja. The descendants of Vikram are called sukarajas and those of Shalivahana (Rajaputra). All claim to belong to one of the branches or vamsas of the kshatriyaas somavamsa of the moon branch, sun branch, sesha vamsa or the snake branch and Yadu Vamsa.

    ReplyDelete
  70. 285



    traditional total of ninety-six clans which are said to be sprung
    from the rulers of fifty-six countries who are the descendants of
    Vrkram of Ujain whose traditional date is B.C. 56, Shalivahan of
    Paithan whose traditional date is A.D. 78, and Bhojraja of Malva
    whose traditional date is about the end of the tenth century.
    According to the "traditional accounts, the Bhosles to whom Shivaji
    belonged are the descendants of Bhojraja; the descendants of Vikram
    are called Sukarajas; and those^of Shalivahan Rajakumars. All claim
    to belong to one of the four branches or vanshas of the Kshatriyas,
    Som-vansha or the Moon branch, Surya-vansha or the Sun branch,
    Sesh-vansha or the Snake branch, and Yadu-vansha or the Shepherd
    branch. The names of some of the families of these four branches
    are : Of the Sun branch, Aparadhe, Bichare, Bhosle, Bhovar, Dalvi,
    Dhdrrao, Hendhe, Gavse, Ghad, Ghadke, Ghag,- Ghorpade, Joshi,
    Kadam, Malap, Mulik, Nakase, Nalavde, Nayak, Palve, Pardhe,
    Patak, Patade, Povar, Rane, Rao, Raul, Sagvan, Salve, Sankpal,
    Shinde, Shisode, Shitole, Surne, and Vaghmare ; of the Moon
    branch, Bhate, Chavan, Dabhade, Dalpate, Darbare, Gaikavad,
    Ghadam, Ghadke, Insulkar, Jagtap, Kalpate, Kamble, Kambre,
    Kapvate, Kathe, Kesarkar, Man, Mahatre, Mohite, More, Nikam,
    Nimbalkar, Patankar, Randive, Savant, Shelkar, and Varange; of
    the Snake branch, Bagve, Bhoir, Bogle, Chirphule, Dhulap, Dhumal,
    Dhure, Divte, Gavli, Jamble, Kasle, Lendpoval, Mhadik, Mokari,
    Namjade, Parabh, Sangal, Tavde, and Thakur; and of the Shepherd
    branch, Bagvan, Bulke, Dhumak, Gavand, Gharat, Ghavad, Ghogale,
    Jadhav, Jagle, Jagpal, Jalindhare, Jare, Jasvant, Mokal, Malpovar,
    Patel, Phakade, Shelke, Shirgone, Shirke, Tambte, Tovar, and
    Yadav



    THE GAZETTEER OF BOMBAY PRESIDENCY –POONA

    VOLUME –XVIII PART--1


    .

    ReplyDelete
  71. అభి గారి బాంబె గజటీర్ సమాచారం లొ పొరపాటు ఉన్నది. yadu-vansha అనే పదం ప్రక్కన or shepherd branch అని బాంబే గెజటీర్ లొ ఉన్నది దానిని అభి గారు ఇవ్వలేదు.





    . 285



    traditional total of ninety-six clans which are said to be sprung
    from the rulers of fifty-six countries who are the descendants of
    Vrkram of Ujain whose traditional date is B.C. 56, Shalivahan of
    Paithan whose traditional date is A.D. 78, and Bhojraja of Malva
    whose traditional date is about the end of the tenth century.
    According to the "traditional accounts, the Bhosles to whom Shivaji
    belonged are the descendants of Bhojraja; the descendants of Vikram
    are called Sukarajas; and those^of Shalivahan Rajakumars. All claim
    to belong to one of the four branches or vanshas of the Kshatriyas,
    Som-vansha or the Moon branch, Surya-vansha or the Sun branch,
    Sesh-vansha or the Snake branch, and Yadu-vansha or the Shepherd
    branch. The names of some of the families of these four branches
    are : Of the Sun branch, Aparadhe, Bichare, Bhosle, Bhovar, Dalvi,
    Dhdrrao, Hendhe, Gavse, Ghad, Ghadke, Ghag,- Ghorpade, Joshi,
    Kadam, Malap, Mulik, Nakase, Nalavde, Nayak, Palve, Pardhe,
    Patak, Patade, Povar, Rane, Rao, Raul, Sagvan, Salve, Sankpal,
    Shinde, Shisode, Shitole, Surne, and Vaghmare ; of the Moon
    branch, Bhate, Chavan, Dabhade, Dalpate, Darbare, Gaikavad,
    Ghadam, Ghadke, Insulkar, Jagtap, Kalpate, Kamble, Kambre,
    Kapvate, Kathe, Kesarkar, Man, Mahatre, Mohite, More, Nikam,
    Nimbalkar, Patankar, Randive, Savant, Shelkar, and Varange; of
    the Snake branch, Bagve, Bhoir, Bogle, Chirphule, Dhulap, Dhumal,
    Dhure, Divte, Gavli, Jamble, Kasle, Lendpoval, Mhadik, Mokari,
    Namjade, Parabh, Sangal, Tavde, and Thakur; and of the Shepherd
    branch, Bagvan, Bulke, Dhumak, Gavand, Gharat, Ghavad, Ghogale,
    Jadhav, Jagle, Jagpal, Jalindhare, Jare, Jasvant, Mokal, Malpovar,
    Patel, Phakade, Shelke, Shirgone, Shirke, Tambte, Tovar, and
    Yadav



    THE GAZETTEER OF BOMBAY PRESIDENCY –POONA

    VOLUME –XVIII PART--1

    ReplyDelete
    Replies
    1. Gomahishyamadhikam yadavam ani AMARAM ane grandamlo unnadi.

      Delete
  72. Gomahaishyadikam Yadavam dhanam ani AMARAM cheputundi.

    ReplyDelete
    Replies






























    1. Aryula pradana vrutti pasuposhana, Rajan pradana vidhi Govula rakshana. Vedakalamlo Rajuni Gopa, Golla anevaru.


      Delete
  73. dupam gariki mee blog lo ichindi saripoyinattu ledu......ikkada kuda tayarayyaru....malli ikkada kuda ade pedtanu...tavva garu idi khachtmga approve cheyalsindi ga manavi....

    ikkado pichi medhavi mahabharatham gurinchi nandudu vasudevudu gurinchi valledo parichayamleni manushullga matladutunnadu....idem daridramo nuvu chaduvkone teacher ayyava ani naku anumana vastondi....nandudu, vasudevudu annadammulani telisinatlu ledu,,,,,konchem charitra telsuko abbi...puranalu saduvu.....matladithe tellodu raasina koothala gurinchi matladutunnav....GOLLAla meeda antha prema unnavadivythe nuvu cheppina 1950 mundu neeku baaga nachina ade britishers MADARS GOVERNMENT G.O. NO.5240 13 DEC 1930 lo em chepparo sadavalekapoyava.....matladithe puttaparthi ani evaro pedhayana gurinchi matladutunnavu.....RAYALAvamsa descendant krishnadevaraya(america return), S/O achyutha devaraya emannado vinnatlu ledu....vadilthe perulo NAIDU undi...chandra babu naidu kuda balijae ane lagunnav....evaryna manchi positionlo unte chalu manavade ane lagunnav.....anduke mee meeda pranthaniko sametha.....uriko pitta katha cheptaru...andhralo ki madhya pradesh nundi vachina yadavulu/gollalu palnati rajulu,kakteeyulu, katamaraju....katama raju ki golla prabhuvu ani devudni chesindi golla suddulu kadu.....srinatha kavi sarvabhowmudu.....aayana prastavinchina palnati charitra, katama raju la gurinchi saduvu...ne sankuchitha swabhavanni....loka gnananni knchem tagginchuko... nellorelo gundlapalle daggara bramheswaralayam daggari dorikina sasanallo inscriptions lo katamaraju gurinchi yadavudani undi aayana vamsa charitra undi..chandravamsa kshatriyudani undi....adi arudra sonthmga raasina natakam kaadu....deenne raasadu......prapanchamlo balijalu yadavulu okkatenani ekkadaina anevu......notitho navvaru.....mahrashtra meeduga vachina yaduvamseeyulu karnataka kerala vypu vellaru.....yaduvamsamlo ea rajuku yadav ani pru undadu chivarlo.....devagiri yadavulanu kakatiyulu,chalukyulu sasanallo sainilu ani perkonnaru...endukante chalukyulu, kakatiyulu yadu vamsiyule...rudramadevi bandhuvulyna hakka bukka le vijayanagara samrajyanni sthapincharu....pl watch
    https://www.youtube.com/watch?v=x__tZ8iA6_s
    ee video nu choodu kurnoollo gollalu thama racharikanni ela kaapadukuntu vastunnaro arthamautundi..aa voorikelli adugu gollalu yadavula theda gurinchi
    https://www.youtube.com/watch?v=5Zp1OjvNIm4
    arya samskruthi lo pradhana poshana pradhan vruthi...raju vatini kapadevadu kabatti..gopa, gopathi anevaru...go to indian gazette.....vethuku...search chey nee agnananni parathroli..manaishiga maaru...gollalaki anni kulalu sarva samanule...andke palnati anugu raju bramhanaidu yokka alochana aina " saddi koodu" ni visheshamga protsahinchadu...katamaraju nalasidhi rajunu mosam cheyaledu....nalasidhi raju katamarajuni mosam chesadu...dharmanni aacharinchadu maalalani, madigalani, gosangeelanu, erukalanu...chala baga chuskunnadu anduke charitarhudynadu....aa yudhaniki karanamevaro, vallento ikkada aprusthutham....

    ReplyDelete
  74. yadavulaku pashu sampada untundi. poorvam rajulu entha goppavado cheppalante...aayanakunna pashu sampadani chusi cheppevaru....ikkada artham kaleda gollalu rajulani....gorrelu meputaru kavuna gorla varu anevaru....ade kaalakramena golla ga maarindi....
    golla vruthi vachkam, yadav vamsa vachakam
    sannidhi golla aalayallo adoka door open chese post kadu...kevalam tirumalalo yadavudukiche gouravam...chandragiri kota gani, govinda raja swamy aalayam gani, sri kalahasthi temple gani....tirupathi vaibhavamlo yadavula patra amogham
    gollala charitra evaro raaste teliyalsina avasaramledu.....yadavudi charitra lenide...desa charitra ledu....
    rayalu ane yadavula surname ni inkokaru vadukunte naketuvanti abhyantharam ledu...yadu vamsa goppatananni bahatamga oppukuntunnarannamata....SKDR alludaina achyutha devarayalu GAYA lo raasina saasananni chaduko......ee lekkana dakshina bharatha desamlo yadavulu mysore maharaju, aayana vamsasthulu, skdr mariyu aayana vamsasthulu antav...ante hardly oka 50 mandi yadavulu unnarantav.....


    for a change chinna discussion..balija ane padaniki meaning enti...daani charitra enti...eppudu nundi ila pilustunnaru.....kshtriyulythe gaazulu endkammukunevallu...setti samayam ante ento baaga artham chesko....
    ikkadu raayalu ani perunte....migatha chotla naickar ani endku petkunevallu...for your kind info tamilnadu lo kapu naidlu unnaru, kamma naidlunnaru, yadav naidlunnaru...kaapulu kakunda separate ga yadav naidlu endukunnatto maku cheppandi
    1950 ki mundu kaapulu bhooswamulu ga undevallu...evadem chebithe adi raasaadu tellodu...aina kuda madras govt golla ante yadav ane GOVT LAW 5240 release chesindi velladinchindi.....political benefit kosam antavemo aanadu congress edyna chebithe addu cheppi neggagala partylu emi levu

    ReplyDelete
  75. ikkada dupam abhi ane picha medhavi ki britishu varidi baaga nachinattundi...telugu vallu cheppithe nachaka swatantraniki poorvam gollalu yadavulu ani nirupinchataniki govt records adigadu.....independance ki mundu andhrulu madras govt lo undevaru...appudu 1930 decemberlo madras govt release chesina G.O.NO.5240 ni chaduvukuni gnananni pempondichukovalsindiga koruchunnamu.....ila chupinchgaligithe SRI KRISHNA DEVARAYALU balija kadu ani oppukuntanani post chesaru....maata meeda nilabade purushudae aithe nilabettukovali...post cheyaledu ani ante ...i've screen shot of that particular post....tavva obul reddy gariki idi post chesi dupam garini tag cheyavalasindiga manavi...dhanyavadamulu

    ReplyDelete
  76. archive.org/stream/cu31924070623677/cu31924070623677_djvu.txt
    Full text of "Gazetteer of the Bombay Presidency". •A. THE GIFT O

    ReplyDelete