Friday, July 9, 2010

శ్రీ కృష్ణ దేవరాయల పంచశత పట్టాభిషేక మహోత్సవాలు

సాహితీ సమరాంగణ చక్రవర్తి, ఆంధ్ర భోజుడు శ్రీ కృష్ణ దేవరాయల పంచశత పట్టాభిషేక మహోత్సవాలను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2010 జూలై 5 వ తేదీన హైదరాబాదులో ప్రారంభించింది. ఈ ఉత్సవాలు ఆగస్టు నెల 8 వ తేదీన అనంతపురంజిల్లా పెనుకొండలో జరిగే ముగింపు ఉత్సవాలతో ముగుస్తాయి. జులై 5 ,6 ,7  తేదీలలో  హైదరాబాదు లో , 14,15 తేదీలలో  చంద్రగిరి లో , 16 , 17 ఉదయగిరిలో , 18 , 19 తేదీలలో కొండవీడులో , 26 , 27  తేదీలలో  ఖమ్మంలో 25,26  తేదీలలో కడపలో , 30 , 31 తేదీలలో విశాఖపట్నం జిల్లా పొట్నూర్ లో , ఆగస్టు 2,3 తేదీలలో కర్నూలులోనూ  కూడా ఈ ఉత్సవాలు జరుగుతాయి.

No comments:

Post a Comment